డొనాల్డ్ ట్రంప్... రామ్ చరణ్, అఖిల్, శ్రీయ ఒకే కార్యక్రమంలో!
హైదరాబాద్: చారిటీ కార్యక్రమాల కోసం నిధులు సమకూర్చడం కోసం సినీతారలతో కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి చూస్తూనే ఉన్నాయి. తాజాగి ఇలాంటి కార్యక్రమమే ఒకటి అమెరికాలో జరుగబోతోంది.
కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి శల్లి కుమార్ అనే వ్యక్తి ఛారిటీ కాన్సెర్ట్ ను ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు.

ఈ చారిటీ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, అఖిల్, శ్రియసరన్, ప్రభుదేవాతో పాటు బాలీవుడ్ నుండి మలైకా అరోరా, సోఫీ చౌదరిలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ హాజరవుతున్నారు.


Click it and Unblock the Notifications











