Don't Miss!
- Sports హార్దిక్ వద్దు.. రోహిత్ తర్వాత అతనే భారత్ కెప్టెన్- హర్భజన్
- Finance Loan Fraud: మహీంద్రా ఫైనాన్స్ కంపెనీలో రూ.150 కోట్ల మోసం.. స్టాక్ ఢమాల్..
- News పవన్ నామినేషన్ ర్యాలీలో పాల్గొనబోయే టాలీవుడ్ సెలెబ్రిటీలు వీళ్లే..!!
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- Technology Realme నుంచి కొత్త ఫోన్ Realme Narzo 70 5G లాంచ్ రేపే! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
అన్ని జాగ్రత్తలతో సురేంద్ర రెడ్డి, అది చెప్పటానికే ఈ లుక్ వదిలారు
హైదరాబాద్: రామ్ చరణ్ ప్రస్తుతం తన తాజా చిత్రం ధృవ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తమిళ చిత్రం తని ఒరువన్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గురించి దర్శకుడు సురేంద్ర రెడ్డి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన ఫస్ట్ లుక్ లాంటి అద్బుతమైన ఫొటోని రిలీజ్ చేసారు. ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఆయన ఏమన్నారో..ఏం ఫొటో చేసారో క్రింద చూడండి..
ప్రస్తుతం ఈ చిత్రం టీమ్ అంతా కాశ్మీర్ కు వెళ్తున్నారు. అక్కడ రామ్ చరణ్, రకుల్ ప్రీతి సింగ్ ల మీద సీన్స్ చిత్రీకరిస్తారు. అలాగే తెలుగు నేటివిటీ కోసం చిత్రం కథలో పూర్తి మార్పులు చేసినట్లు తెలుస్తోంది.తమిళం కన్నా తెలుగులో మరింత స్టైలిష్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సురేంద్రరెడ్డి బావిస్తున్నారు.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన 'తని ఒరువన్'కి ఇది రీమేక్. ఇందులో రామ్చరణ్ అథ్లెటిక్ దేహంతో కనిపించనున్నారు.
స్లైడ్ షోలో రామ్ చరణ్ షూటింగ్ లొకేషన్ ఫొటోలు, మరిన్ని విశేషాలతో..
రెండు షెడ్యూల్స్ లోనూ..
ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా.. రామ్ చరణ్ మాత్రం చిత్ర షూటింగ్ లో పాల్గొన లేదు.
శనివారం నుంచే...
హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకోనుండగా.. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొననున్నాడు.
లొకేషన్
హైదరాబద్.. గచ్చిబౌలి లో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.
దసరాకే..
ఈ చిత్రాన్ని ఆగస్ట్ నెలలో విడుదల చేసేందుకు రామ్ చరణ్ ముందుగా ప్లాన్ చేసినా, ప్రస్తుతం ఈ సినిమాని దసరాకు విడుదల చేయాలనుకున్నట్లు రామ్ చరణ్ భావిస్తున్నట్లు తెలిసింది.
తండ్రి పనుల్లో..
ప్రస్తుతం చిరు 150 వ చిత్రాని రామ్ చరణ్ తన కొనిదెల ప్రొడక్షన్ పై ప్రారంభించిన విషయం తెలిసిందే. తనతండ్రి సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో ఆ పనుల్లో పడి కాస్త లేటైంది.
అయితే ఈ గ్యాప్ లో...
రామ్ చరణ్ తన శరీరంపై పూర్తి దృష్టి పెట్టారు. ముఖ్యంగా ట్రైనీ ఐపియస్ అధికారి పాత్ర కావటంతో ఫిట్ గా ఉండాలని నిర్ణయంచుకున్నారు.
మార్చుకుంటున్నారు
ఫిట్ గా ఉండటం కోసం ఆయన తన ఆహారపు అలవాట్లును సైతం మార్చుకుంటున్నారు. ఈ విషయమై ఆయన స్వయంగా తన అభిమానులకు తెలియచేసారు.
రూట్ మార్చి నో రెమ్యునేషన్
రామ్ చరణ్ 'బ్రూస్ లీ' సినిమా ఫలితంతో రూటు మార్చాడు. నెక్ట్స్ తాను చేయబోయే సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకూడదని, కేవలం సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో షేరింగ్ మాత్రమే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట.
అల్లు అరవింద్ సలహా
ఇలా చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని, సినిమాను నష్టాల భారి నుండి తప్పించవచ్చని అంటున్నాడు. ఇది అల్లు అరవింద్ సలహా అని చెప్తున్నారు.
నవదీప్
ఈ చిత్రంలో మరో యంగ్ హీరో నవదీప్...రామ్ చరణ్ కు ఫ్రెండ్ గా కనిపించనున్నారు.
విలన్ అరవింద్ స్వామి
ఈ సినిమాలో తమిళంలో చేసిన అరవింద్ స్వామినే ఇక్కడ కూడా విలన్ గా తీసుకున్నారు.
రకుల్ తో మరో సారి
గీతా ఆర్ట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోంది.