Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ చరణ్ను చీఫ్ గెస్టుగా ఎంపిక చేసారు?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బండ్ల గణేష్ కాంబినేషన్లో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు బండ్ల గణేష్ నిర్మాతగా 'నీ జతగా నేనుండాలి' అనే చిత్రం కూడా తెరకెక్కుతోంది. ఈచిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 14న ప్లాన్ చేసారు. ఈ ఆడియో వేడుకకు రామ్ చరణ్ చీఫ్ గెస్టుగా హాజరై ఆడియో విడుదల చేస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈ వేడుక జరుగనుంది.
హిందీలో సూపర్ హిట్టయిన 'ఆషిఖి-2' చిత్రానికి ఇది రీమేక్. రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రంలోని 'నీ జతగా నేనుండాలి' అనే పాటనే ఈ చిత్రం టైటిల్గా సెట్ చేసారు. 'బంపర్ ఆఫర్' ఫేం జయరవీంద్ర ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో సచిన్ జోషి, నిర్మాత బండ్ల గణేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ హిందీ వెర్షన్ పోస్టర్ కు డిట్టో ఉండటం గమనార్హం. దీన్ని బట్టి సినిమా కూడా సీన్ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ అలానే తెరకెక్కిస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
హీరో విషయానికొస్తే....గతంలో తెలుగులో నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, మిత్రుడు చిత్రాల్లో నటించాడు. ఇక హీరోయిన్ నాజియా హుస్సేన్ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ బంధువు. దర్శకుడు జయరవీంద్ర గతంలో బంపర్ ఆఫర్(సాయిరామ్ శంకర్)తో చేసి హిట్ కొట్టారు. అలాగే అదే సాయిరామ్ శంకర్ తో చేసిన దిల్లున్నోడు చిత్రం రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ అయ్యింది.
ఈ చిత్రాన్ని హీరో సచిన్ జోషికి చెందిన వికింగ్ మీడియా, బండ్ల గణేష్ కు చెందిన పరమేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ తెలుగు రీమేక్ ని నిర్మిస్తున్నారు. అయితే హీరోనే మొత్తం డబ్బులు పెడుతున్నారని అంతటా వినిపిస్తోంది. బండ్ల గణేష్ కేవలం పేపరు పైన మాత్రమే నిర్మాత గా మాత్రమే...ఓ క్యాషియర్ గా వ్యవరిస్తున్నాడని అంటున్నారు.