పవన్ను జనసేన దున్నపోతులు ఎందుకు ప్రశ్నించరు.. వర్మ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి నోరు పారేసుకొన్నాడు. ఎగ్జిబిటర్స్ సేన జనసేన దున్నపోతులను పవన్ను ప్రశ్నించాలని ఎందుకు అడుగరని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి నోరు పారేసుకొన్నాడు. పవన్ కల్యాణ్ అభిమానులు, కాటమరాయుడుపై ఆయన తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
జనసేన దున్నపోతులు..
ఎగ్జిబిటర్స్ సేన జనసేన దున్నపోతులను ఎందుకు అడుగరు. నేను అడిగినట్టు వారు పవన్ కల్యాణ్ను ఎందుకు ప్రశ్నించరు అని నా డ్రైవర్ నన్ను అడిగారు.
అవతార్ కంటే కాటమరాయుడు బెటర్
కాటమరాయుడు సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. అవతార్, బాహుబలి2 ట్రైలర్ కంటే బాగుంది. ఇంకా బాహుబలి2 విడుదల కాలేదు కాబట్టి మరో 100 మిలియన్ల వ్యూస్ను చూస్తాను అని వర్మ ట్వీట్ చేశారు.
భ్రమల్లో పవన్ ఫ్యాన్స్
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భ్రమల్లో బతుకుతుంటారు. వారి అంధకారమే వారి నేతలు వాస్తవాన్ని గ్రహించలేని గుడ్డివాళ్లను చేస్తున్నది అని మరో ట్వీట్ చేశారు.
బాహుబలి2 చూసి కూడా
సినీ పరిశ్రమలో పెద్ద నటులకు సలహా ఇవ్వదలుచుకోలేదు కానీ బాహుబలి2 ట్రైలర్ను చూసిన తర్వాత కూడా పవర్ లేని సినిమాలను ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదు అని మరో ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











