Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సురేష్ బాబు నాలా కాదు
సురేష్ నాకంటే కచ్చితంగా ఉంటాడు. నేను మొహమాటం కొద్దీ సినిమాలు ఒప్పుకొని డబ్బులు పోగొట్టుకొన్న సందర్భాలున్నాయి. సురేష్ అలా కాదు... 'రూపాయి కూడా పోకూడదు డాడీ. రిస్క్ తీసుకోలేను' అంటాడు అంటూ చెప్పుకొచ్చారు రామానాయుడు. ఆయన తన తాజా చిత్రం ముగ్గురు ప్రమోషన్ లో కలిసిన మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.అలాగే ఇప్పటి నిర్మాత పరిస్ధితి మారిపోయిందని చెప్తూ... అప్పుడు నిర్మాతకు బాధ్యతలెక్కువ. సినిమా పోతే పంపిణీదారులకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. అందుకే కథ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొనేవారు. ఓ దర్శకుడు, ఓ నిర్మాత కలిసి హీరోని వెతికేవారు. ఇప్పుడు అలా కాదు... హీరో, నిర్మాత కలిసి దర్శకుడిని వెతుకుతున్నారు. నిర్మాత చెక్కుల మీద సంతకాలు చేయడానికి మాత్రమే కాదు.కథలో అతని ప్రమేయం తప్పకుండా ఉండాలి అన్నారు.రామానాయుడు నిర్మించిన 140వ చిత్రం 'ముగ్గురు'. ఈ నెల 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వియన్ ఆదిత్య దర్శకత్వంలో 'ముగ్గురు'రూపొందింది.