Don't Miss!
- News సివిల్స్ విజేతను చేసిన అవమానం-ఆంధ్రా కానిస్టేబుల్ విజయ గాథ..!
- Finance Paytm News: పేటీఎంకు మరో దెబ్బ..! దానిని నిషేధించిన ప్రభుత్వం.. ఎందుకంటే..??
- Sports KKR vs RR మ్యాచ్ టర్నింగ్ పాయింట్: రియాన్ పరాగ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్.. !వీడియో
- Technology WhatsApp మరియు Instagram లో Meta Ai ని ఎలా ఉపయోగించాలి? స్టెప్ బై స్టెప్ గైడ్
- Automobiles తగ్గిన వాహనాల ఎగుమతులు.. అయినా టాప్లో మారుతి సుజుకి.. కారణాలివే.!!
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
రమ్యకృష్ణ కి ఆ అవకాశం మళ్ళీ 17 ఏళ్ళకి వచ్చింది
నీలాంబరి.... పదిహేడేళ్ళ క్రితం వచ్చిన "నరసింహ" (పడయప్పా) లో రమ్య కృష్ణ చేసిన పాత్ర. హీరో తో సమానంగా అదీ ఒక లెజెండ్ అంతటి పేరున్న అగ్రహీరో రజినీ కాంత్ తో పోటాపోటీగా నటించాల్సిన సినిమా. ఎక్కడా తడబడలేదు. నరసింహ ఒక బ్లాక్ బస్టర్ కావటం లో ఖచ్చితంగా రమ్యకృష్ణ కూడా సగం కారణం.
నీలాంబరి అనే పేరు కొన్నేళ్ళ పాటు తమిళనాట గుర్తుండిపోయింది. తమిళ అమ్మాయే అయినా ఎక్కువగా తెళుగులోనే పాపులర్ అయిన రమ్యకృష్ణ పడయప్పా లాణ్తి ఒక్క సినిమాతోనే అక్కడ స్టార్ రేంజ్ ని సొంతం చేసుకుంది.
చాలాకాలం గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రమ్యకృష్ణకు అవకాశాలు వెతుక్కుంటు వస్తున్నాయి. బాహుబలితో అందరిని మెప్పించిన రమ్యకృష్ణ...సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో అలరించింది. ఏ పాత్రనైనా అవలీలగా చేయగల రమ్యకృష్ణ ఇపుడు టాలీవుడ్లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.
రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ను సూపర్ హిట్ గా రన్ చేస్తుంది. బాహుబలి సీక్వెల్ లో నటిస్తూనే మరో వైపున మంచి పాత్రలోస్తే ఆ పాత్రలను కూడా వద్దనకుందా చేస్తోంది. ఇప్పటికే రమ్యకృష్ణ కమల్ హాసన్ తో తొలిసారిగా హీరోయిన్ గా శృతి హాసన్ కు తల్లిగా ఎంపిక అయిందనే టాక్ వినిపిస్తోంది.
కాగా ఇప్పుడు మరో ఆఫర్ అందుకున్న రమ్యకృష్ణ అని అంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో రాజనీకాంత్ 'రోబో 2.0' సినిమాలో ఓ ముఖ్య పాత్రకు గాను రమ్య ను ఎంచుకున్నారట. ఈ సినిమాలో రమ్య పాత్ర చిన్నదైనా కధలో కీలక పాత్ర అట. చాలా ప్రాముఖ్య మున్న పాత్ర కనుక రమ్యకృష్ణ అయితే బాగుంటుందని రోబో చిత్ర యూనిట్ భావిస్తున్నారట. 17 సంవత్సరాలు తర్వాత మళ్ళీ రజినీ కాంత్ తో కలిసి తెరపై కనిపించబోతున్నారట.