ఏకంగా ఆస్కార్కే గురిపెట్టిన హాట్ ఆంటీ(ఫోటోలు)
హైదరాబాద్ : తన తాజా సినిమా 'ఓ మల్లి' ఆస్కార్ అవార్డు అందుకుంటుందని నమ్మకంతో చెబుతోంది నటి రమ్య శ్రీ. ఆ అవార్డు దక్కక పోయినా నామినేషన్ పొందినా చాలు అదో గౌరవమే అంటోంది. ఈ మధ్య వెండితెరపై ఎక్కువగా కనిపించడం లేదుకానీ ఒకప్పుడు వివిధ పాత్రల్లో నటించిన నటి రమ్యశ్రీ.
ఐటం గర్ల్గా, వ్యాంప్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఆమె ఎక్కడా క్లిక్ కాలేకపోయింది. దీంతో రూటు మార్చి నగ్న అందాలను ప్రదర్శిస్తూ సెక్సీ ఆంటీగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. సెక్సీ ఆంటీ పాత్రలు చేస్తూ వివిధ భాషా చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్న రమ్యశ్రీ తాజాగా 'ఓ మల్లి' చిత్రంతో సరికొత్త ఆలోచనకు తెరలేపింది.
ఆర్.ఎ. ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రమ్యశ్రీ స్వీయ దర్శకత్వంలో 'ఓ మల్లి' చిత్రం తెరకెక్కుతోంది. ఈ రోజు రమ్యశ్రీ పుట్టినరోజు. మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

హార్ట్ టచ్ చేసే సబ్జెక్టు
రమ్య శ్రీ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘ఓ మల్లి' చిత్రం ప్రేక్షకుల హృదయాలను టజ్ చేసే సబ్జెక్టుతో తెరకెక్కుతోందని అంటున్నారు. చూడటానికి ఇది ఆర్ట్ ఫిల్మ్ లా ఉన్న కమర్షియల్ వ్యాల్యూస్ సైతం ఉంటాయట.

అందాల విందు
రమ్యశ్రీ అభిమానులకు ఈ సినిమా అందాల విందు అని చెప్పొచ్చు. ఇందులో ఆమె అందాల ప్రదర్శన ఆమె సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండనుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు హాట్ టాక్ తెచ్చుకున్నాయి.

రమ్యశ్రీ
రమ్యశ్రీ మాట్లాడుతూ...14 ఏళ్లుగా అనుకున్న కథ, వేరే వారు దర్శకత్వం వహిస్తే కథ చెడిపోతుందని నేనే అందుకు పూనుకున్నాను. జేసుదాసులాంటి వారు ఫోన్ చేసి పాటలు బాగున్నాయన్నాయనడం మరిచిపోలేని అనుభూతి. సినిమా తప్పకుండా నేను అనుకున్న అంచనాలకు రీచ్ అవుతుందని అనుకుంటున్నాను అని తెలిపారు.

కథాంశం
భర్తను ఎంతగానో ప్రేమించే మల్లి జీవితం ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొందనే కథాంశంతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పలు పతిష్టాత్మక చలన చిత్రోత్సవాలకు పంపనున్నారు. అలాగే ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగానికి కూడా పంపబోతున్నారట.

అర్హత ఉందంటున్న రమ్యశ్రీ
ఆస్కార్ అవార్డులకు పంపించే అన్ని అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయని రమ్యశ్రీ అంటున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆస్కార్ అవార్డులు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. కేవలం నమినేషన్ పొందినా చాలు అంటున్నారామె.

విడుదల ఎప్పుడంటే
‘ఓ మల్లి' చిత్రం ఆడియో ఆగస్టు నెలాఖరున విడుదల చేసే....సెప్టెంబర్ నెలలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఆర్.ఎ. ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రమ్యశ్రీ స్వీయ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











