Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కన్నడ నటి రాగిణితో ఎఫైర్, రాణా ఆగ్రహం!
హైదరాబాద్: హీరో రాణా, త్రిష మధ్య ఎఫైర్ ఉన్నట్లు చాలా కాలంగా షికార్లు పుకార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాణా కన్నడ నటి రాగిణి ద్వివేదితో డేటింగ్ చేస్తున్నట్లు కన్నడ చిత్ర సీమలో పుకార్లు స్ప్రెడ్ అయ్యాయి. ఓ ప్రముఖ పత్రికలో ఈ విషయమై వార్త కూడా ప్రచురితమైంది.
ఈ పరిణామాలతో అసహనానికి గురైన రానా ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. 'ఓ అవార్డు రిహార్సల్ సెషన్స్ కు సంబంధించిన ఫోటోలు ప్రచురించి అవాస్తవ వార్తలు రాసారని, ఇది పూర్తిగా దిగజారుడు తనమే' అంటూ రాణా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. రాగిణి ద్వివేది రాణా జీవితంలో స్పెషల్ పర్సన్ అని, వాళ్ల మధ్య స్నేహాన్ని మించిన బంధం ఉందని సదరు పత్రిక పేర్కొంది.
రాణా గురించి ఇలాంటి వార్తలు కొత్తమే కాదు. గతంలో బిపాసా బసుతో, ఆ తర్వాత త్రిషతో, ఇప్పుడు రాగిణి ద్వివేదితో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రాగిణి ద్వివేది గురించి కూడా కన్నడ మీడియాలో గతంలో అనేక వార్తలు వచ్చాయి. కన్నడ నటుడు యోగేష్ తో ఆమెకు ఎఫైర్ ఉన్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా రాణాతో ఎఫైర్ విషయంలో ఆమె స్పందించలేదు.
రాణా సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం రాణా గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి' చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' చిత్రం చేస్తున్నారు.