Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నిలిచిపోనున్న రంగస్థలం చిత్ర ప్రదర్శన.. ఆ గొడవలే కారణం!
బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం చిత్ర డ్రీమ్ రన్ కొనసాగుతోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో రంగస్థలం చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రలో రంగస్థలం చిత్రం ఇప్పటికే 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం విశేషం.ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా షేర్ తో దూసుకుపోతోంది. ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగిలిన ఏరియాలలో కూడా కళ్ళు చెదిరే వసూళ్లు దక్కుతున్నాయి. కాగా రంగస్థలం చిత్ర ప్రదర్శనకు ఈ ఆదివారం నుంచి స్వల్ప అంతరాయం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో డిజిటల్ ప్రొవైడర్లకు వ్యతిరేకంగా చిత్ర పరిశ్రమ తన ఆందోళనని మరింత ఉదృతం చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తమిళ చిత్రాల ప్రదర్శన తమిళనాడులో ఆగిపోయిన సంగతి తెలిసిందే. పరభాషా చిత్రాలు ప్రదర్శన జరుగుతోంది. వాటిని కూడా నిలిపివేయాలని తమిళ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది.
దీనితో ఈ ఆదివారం నుంచి చెన్నై మరియు తమిళనాడులోని ఇతర ఏరియాలలో రంగస్థలం చిత్ర ప్రదర్శన నిలచిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రంగస్థలం చిత్ర యూనిట్ కు ఇది కొంత నిరాశ కలిగించే అంశమే అయినా తొలివారంలో దాదాపుగా వసూళ్లు వచ్చేస్తాయి కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.