Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
యాంకర్ రేష్మి .....జామెడీపై కాలేజీ కుర్రాళ్లు ఆసక్తి!
హైదరాబాద్: తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్యబాలకృష్ణన్, చలాకి చంటి, శివన్నారాయణ, ఫిష్ వెంకట్ తదితరులు నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'తను.. వచ్చేనంట'. అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శత్వం వహిస్తున్నారు.
శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ నిమిత్తం రేష్మి గౌతమ్, తేజ కాకుమాను విజయవాడ రేడియో మిర్చిలో, విజయవాడ సిద్దార్ధ కాలేజీ స్టూడెంట్స్ తో హల్చల్ చేసారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల మాట్లాడుతూ "ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మా హీరో తేజ కాకుమాను విజయవాడ వాడే కావడంతో జనాల్లో అతనికి మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నారు.
జామెడీ అంటే ఏంటి అని
రేడియో మిర్చి ప్రోగ్రాం కి, సిద్దార్ధ కాలేజీ కి వెళ్ళినప్పుడు అందరు మీ చిత్రం ట్రైలర్ చూసాము, సాంగ్స్ విన్నాము చాల బాగున్నాయి అని చెప్తున్నారు. జామెడీ అంటే ఏంటి అని ఎంతో ఆతృతగా అడుగుతున్నారు, జాంబీ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న కామెడీ మూవీ ఇది, అందుకే జామెడీ అంటున్నా అని చంద్రశేఖర్ తెలిపారు.
ప్రేక్షకుల నుండి
మా చిత్రానికి మేము అనుకున్నదానికంటే మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తుంది. ఈ చిత్రం ప్రమోషన్ కోసం ఈ రోజు మధ్యాహ్నం విజయవాడలోని ప్రముఖ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లకి మా హీరో, హీరోయిన్ లు తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, చలాకి చంటి వస్తున్నారు. మొదటినుంచి మాచిత్రాన్ని జనాలకి బాగా చేరువ చేసిన మీడియా వారికి కృతఙ్ఞతలు తెలుపుతున్నాము అని అన్నారు.
బాహుబలి చిత్రం తర్వాత ఈ సినిమాలో
హీరో తేజ కాకుమాను మాట్లాడుతూ "నేను విజయవాడ లోనే చదువుకున్నాను. నను ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. బాహుబలి చిత్రం తర్వాత ఈ సినిమాలో హీరోగా తొలి పరిచయం కావడం ఆనందంగా ఉంది." అని అన్నారు.
తెర వెనక
ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యుసర్: బెక్కెం రవీందర్, ఆర్ట్: సిస్తల శర్మ, కెమెరా: రాజ్కుమార్, ఎడిటింగ్ టీమ్: గ్యారీ బి.హెచ్; గణేష్.డి, విజువల్ ఎఫెక్ట్స్: విజయ్, సంగీతం: రవిచంద్ర, నేపథ్య సంగీతం: శశిప్రీతం, సహనిర్మాత: పి.యశ్వంత్, పాటలు: చల్లా భాగ్యలక్ష్మీ, కథ-నిర్మాత: చంద్రశేఖర్ ఆజాద్ ��ాటిబండ్ల, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కె. రాఘవేంద్రరెడ్డి.
ఎక్స్ ఫోజింగులో రష్మి రచ్చ
గుంటూరు టాకీస్ సినిమాలో పిచ్చి పిచ్చిగా ఎక్స్ ఫోజింగ్ చేయడంతో రష్మికి తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి. తను వచ్చెనంట సినిమాలో కూడా రష్మి ఎక్ష్ ఫోజింగుతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోందట.