Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మహేష్ ముంచేసాడు...మరి రవితేజ తేలుస్తాడా
అప్పట్లో యు.టివి వారు మహేష్ తో కలిసి అతిధి చిత్రం నిర్మించిన సంగతి తెలిసిందే. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాన్నుంచి కోలుకోవటానికి మహేష్ కి మూడేళ్ళు పడితే, యు.టివి వారికి నాలుగేళ్ళు పట్టింది. ఇప్పుడు వారు రవితేజతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు వారు రవితేజతో సిట్టింగ్స్ జరిపినట్లుతెలుస్తోంది. సౌత్ రీజియన్ హెడ్ ధనుంజయ్ ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. రవితేజతో జరిగిన మీటింగ్ చాలా ఉత్సాహభరితంగా జరిగిందని, రవితేజ కూడా చాలా ఎక్సైట్ అయ్యాడని అన్నారు. అంటే త్వరలో రవితేజతో వారు సినిమా చేయనున్నారన్నమాట. అయితే డైరక్టర్ ఎవరన్నది మాత్రం ఫిక్స్ కాలేదు. అతిధితో ప్లాప్ ఇచ్చిన సురేంద్ర రెడ్డి ఆ తర్వాత రవితేజకు కిక్ తో హిట్టిచ్చాడు కాబట్టి పాత పరిచయాలను పురస్కరించుకుని క్రేజీ కాంబినేషన్ అయ్యేటట్లుగా సురేంద్రరెడ్డితో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ వీర చిత్రం చేస్తున్నారు.