Just In
- 4 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
- 5 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 5 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోం మినిస్టర్ జోక్యంతో, 'అ..ఆ ' నుంచి పదాలు మ్యూట్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ హీరో నితిన్, సమంతల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అ..ఆ..'. మీనాకు రీమేక్ అనే పేరు తెచ్చుకున్నా, ఫ్యామిలీలకు బాగా పట్టడంతో ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాకు అంతా బాగానే ఉన్నా..రెడ్డి కులస్దులను అవమానం చేసారనే అరోపణలు ఎదుర్కొంది.
ఈ సినిమాలో హాస్య నటుడు షకలక శంకర్ ఓ దొంగ. అతను పేరు ప్రతాప్ రెడ్డి. అలాగే హైదరాబాద్ లో ఫ్రెండ్ ఉంటాడు. అతని పేరు బాల్ రెడ్డి ఫ్రం బంజారా హిల్స్ అని చెప్తాడు. ఇప్పుడీ ఈ రెండు పేర్లు అంతటా చర్చకు వచ్చాయి.
సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకే రెడ్డి జన సంఘం వారు ఈ పేర్లు తొలిగించాలంటూ కంప్లైంట్ చేసింది. అయితే మేకర్స్ దీనిపై స్పందించకపోవటంతో తెలంగాణా హోం మినిస్టర్ నాయని నర్సింహారెడ్డి కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దాంతో ఈ పేర్ల విషయంలో రెడ్డి అనే పదాన్ని ఇప్పుడు మ్యూట్ చేసారు నిర్మాతలు.

ఈ విషయమై నిర్మాతలు పేర్లు మ్యూట్ చేయటంలో లేటైనందుకు కారణం చెప్తూ... అభ్యంతరాలు వచ్చేసరికే డిజిటల్ ఫ్రింట్స్ వెళ్లిపోయాయి.అవి అక్కడ వారం రోజులు పాటు లాక్ అవుతాయి. ఆ సమయంలో ఏమీ చెయ్యలేం. మిగతా ధియేటర్స్ అన్నిటికి ఈ మార్చిన వెర్షన్ ని పంపటం జరిగింది. ఇప్పుడు మార్చిన వెర్షన్ అన్ని ధియేటర్స్ లోనూ తెరపై చూడవచ్చు. అలాగే కావాలని ఆ కమ్యూనిటిని మేం అవమానించేలా సీన్స్ ని పిక్చరైజ్ చేయలేదు అని అన్నారు.
ఇక రిలీజ్ కు ముందు నుంచే మంచి అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా, జూన్ 2న విడుదలై సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్గా నిలిచింది. త్రివిక్రమ్ డైలాగులుకు, రావు రమేష్ నటనకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ఓవర్ సీస్ లోనూ మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది.