Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పూరి జగన్నాథ్ సినిమాకు నటి రేవతి దర్శకత్వం?
హైదరాబాద్: సౌతిండియాలో ప్రముఖ నటీమణుల్లో రేవతి ఒకరు. త్వరలో ఆమె ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమాను ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.
నటిగా రేవతి తమిళం, తెలుగు, మళయాలం, హిందీ, కన్నడలో అనేక చిత్రాల్లో నటించారు. దర్శకురాలిగా ఆమె ఇప్పటి వరకు ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2002లో ఆమె దర్శకత్వంలో వచ్చిన ఇంగ్లిస్ మూవీ 'Mitr, My Friend' సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ ఇంగ్లీష్ విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది.
తర్వాత ఆమె దర్శకత్వంలో హిందీలో 2004లో ‘ఫిర్ మిలేంగే', 2009లో మళయాలంలో ‘కేరళ కేఫ్', 2010లో హిందీలో ‘ముంబై కట్టింగ్' అనే చిత్రాలు వచ్చాయి. 2011లో రేవతి దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘రెడ్ బిల్డింగ్ వేర్ ఈజ్ ది సన్ సెట్'కు జాతీయ అవార్డు దక్కింది.
పూరి జగన్నాథ్ నిర్మాణంలో రేవతి ఎలాంటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. రేవతి దర్శకత్వం అంటే ఆ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. కమర్షియల్ అంశాలకు దూరంగా, సామాజిక అంశాల నేపథ్యంలోనే ఆమె సినిమాలు ఉంటాయి.