Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దాసరిని కిరీటంతో సత్కరించిన రోశయ్య (ఫోటో)
హైదరాబాద్: తాత-మనవుడు చిత్రంతో దర్శకుడిగా పరిచయమై 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దర్శకరత్న దాసరి నారాయణరావుకు యువకళావాహిని ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఆత్మీయ సత్కారం జరిగింది.
కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్య దాసరికి శాలువా కప్పి కిరీటధారణతో దాసరిని ఘనంగా సత్కరించారు. 40 సంవత్సరాల దీక్షతో యువకళావాహిని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సంస్థను అభినందిస్తూ సంగీతంపై ఉన్న అభిమానంతో రమేష్నాయుడు సినీ సంగీత విభావరి నిర్వహించినందుకు సంస్థను అభినందించారు.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ రమేష్నాయుడు సంగీతం గురించి తెలుగుగాని, ఆయన గొప్పతనాన్ని కొంతమందికే తెలుసునని, హిందీ అగ్రశ్రేణి సంగీత దర్శకుడు లక్ష్మీకాంత్-ప్యారీలాల్ రమేష్నాయుడు దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన విషయం చాలా తక్కువమందికే తెలిసి ఉంటుందని ఆయన అన్నారు. సినీ సంగీత దర్శకులలో రమేష్నాయుడు మించినవారు లేరు ఈ ప్రపంచంలో, రమేష్నాయుడు ఇచ్చిన హిట్స్ మరే సంగీత దర్శకుడు ఇవ్వలేదని దాసరి కొనియాడారు. రమేష్నాయుడు ఎంత నిరాడంబరుడో ఆయన పేరు ఎక్కడా వినిపించకపోవడమే అందుకు నిదర్శనం అన్నారు.