twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ఓపినింగ్(ఫోటో పీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ హీరోగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం శనివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. గీతా ఆర్ట్స్ మరియు ఎస్ వి.సి సినిమాస్ బ్యానర్ పై బన్నివాసు-దిల్ రాజు మేనల్లుడు హర్షిత్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

    సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ఓపినింగ్

    మెగా బ్రదర్శ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

    సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ఓపినింగ్

    అనంతరం తొలిసన్నివేశానికి చిరంజీవి క్లాప్ ఇవ్వగా, పవన్ కళ్యాణ్ కెమెరా స్విఛ్చాన్ చేసారు.

    సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ఓపినింగ్

    కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

    సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ఓపినింగ్

    చిరంజీవి మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ నా మేనల్లుడు మాత్రమే కాదు. చరణ్ తర్వాత మరో తనుయుడు లాంటివాడు. తన రెండవ చిత్రం గీతా ఆర్ట్స్ లో చేయటం శుభసూచకంగా భావిస్తున్నాను. మా కుటుంబం నుంచి వచ్చే ప్రతీ హీరోకి ఈ బ్యానర్ లో చేయటం ఓ సెంటిమెంట్ అని చెప్పాలి. చరణ్ రెండో చిత్రం మగధీర కూడా అదే బ్యానర్ లో చేసాం. ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. అలాగే దిల్ రాజు బ్యానర్ కూడా చాలా సెంటిమెంట్ అన్నారు.

    సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ఓపినింగ్

    అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మా బ్యానర్ లో చేస్తున్న 32వ చిత్రం ఇది. మొదటి నుంచి దిల్ రాజుకి నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సినిమాకు తన భాగస్వామ్యం కూడా ఉంటే బావుంటుందని నిర్మాణ భాధ్యతలు ఆయనకు అప్పగించాను అన్నారు.

    దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ..

    దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ..

    మొదటి దిల్ రాజు గారికి కథ చెప్పాను. ఆయన నచ్చి అరవింద్ గారి దగ్గరకి తీసుకు వెళ్లారు. ఆయనకు కూడా నచ్చి వెంటనే ఓకే అన్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలతో చేసే అవకాసం రావటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

    సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ఓపినింగ్

    దిల్ రాజు మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పినప్పుడు మా బ్యానర్ లో చేద్దామనుకున్నాను. ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నేను చేయలేకపోతున్నాను. అరవింద్ గారితో అశోశియేట్ అయ్యి చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.

    సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ఓపినింగ్

    సాయి ధరమ్ తేజ మాట్లాడుతూ... నన్ను ఆశ్విదించటానికి మా మామయ్యలందిరకీ ధాంక్స్. పెద్ద ప్రొడ్యూసర్స్ తో ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

    సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ఓపినింగ్

    శ్రీహరి, దువ్వాసి మోహన్, చంద్రమోహన్, సత్యకృష్ణన్, ధర్మవరం, రఘుబాబు తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు మరుధూరి రాజా, పాటలు చంద్రబోస్, అశోక్ తేజ, శ్రీమణి, సంగీతం అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి దాశరధి శివేంద్ర, ఆర్ట్ రమణ వంక, ఎడిటింగ్ గౌతంరాజు, నిర్మాత బన్ని వాసు, హర్షిత్, కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఎఎస్ రవికుమార్ చౌదరి.

    సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ఓపినింగ్

    ఈ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి పద్మభూషణ్ చిరంజీవి, నాగబాబు, పనవ్ కళ్యాణ్, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, వివి వినాయిక్, రాజమౌళి, సుకుమార్, వంశీ పైడిపల్లి, కైకాల నాగేశ్వరరావు, డా వెంకటేశ్వరరావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నాగ అశోక్ కుమార్, సురేష్ బాబు, తదితరులుతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

    English summary
    Sai Dharam Tej's (megastar Chiranjeevi's nephew) new film was launched at Annapurna Studios on Saturday. To be directed by AS Ravi Kumar Chowdary, the untitled project is produced by Bunny Vas while Allu Aravind is presenting the film in association with Dil Raju's Sri Venkateswara Creations. A formal pooja ceremony was held and the regular shooting will commence from next month. Mega heroes Chiranjeevi, Pawan Kalyan, Allu Arjun, Nagababu, Allu Sirish attended the event to wish Sai Dharam Tej good luck. Anup Rubens is scoring the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X