Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ఎర్రగులాబీలు’ గా మారిపోతున్న సమంత, సమీరా రెడ్డి
భారతీ రాజా దర్శకత్వంలో 70వ దశకంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో 'ఎర్రగులాబీలు" ఒకటి. ఈ థ్రిల్లర్ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి ముఖ్య పాత్రలు పోషించిన విషయం విదితమే. తాజాగా ఇదే టైటిల్ తో గౌతమ్ వాసుదేవమీనన్ (ఏ మాయ చేసావె ఫేం) ఓ థ్రిల్లర్ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత, సమీరారెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అశోక్ వల్లభనేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాటలుండవు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం రూపొందుతున్నా తెలుగుకు మాత్రమే ఈ 'ఎర్ర గులాబీలు" టైటిల్ని ఉపయోగిస్తున్నారు. మనోజ్ పరమహంస దీనికి కెమెరా వర్క్ని అందిస్తున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ...ఇది ఓ సైక్లాజికల్ ధ్రిల్లర్. సినిమా మొత్తం ఒక రాత్రిలో జరుగుతుంది. అందుకే షూటింగ్ రాత్రి పూటే తీసాము. టెక్నికల్ గా బాగా కష్టపడి చేసాము అన్నారు. ఇది ఓ ప్రయోగాత్మక చిత్రం అన్నారు. ఈ చిత్రం ప్రోమోస్ విడుదల హైదరాబాద్ లో తాజ్ బంజారాలో జరిగింది.