Just In
- 17 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 23 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 44 min ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 48 min ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
Don't Miss!
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్కు షాక్: రిలయన్స్కు గుడ్న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- News
ఉద్యోగ సంఘాలు కూడా: సుప్రీంకోర్టులో సవాల్?: ప్రాణాలను పణంగా పెట్టలేమంటూ ఆందోళన
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరిలేరు నీకెవ్వరు: అర్ధరాత్రి ఒంటిగంట నుంచే అభిమానుల కోలాహలం
గత అర్థరాత్రి నుంచి ఏ ఏరియాలో చూసినా మహేష్ బాబు అభిమానుల కోలాహలమే కనిపిస్తోంది. ఆయన 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' నేపథ్యంలో అర్థరాత్రి వేళ థియేటర్లన్నీ జనంతో పోటెత్తాయి. ప్రీమియర్ షోస్ చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈలలు, కేకలు పెడుతూ హోరెత్తించారు.
అర్థరాత్రి నుంచి మొదలుకొని ప్రతీ గంటకు థియేటర్స్ వద్ద అభిమానుల తాకిడి పెరుగుతూ వస్తోంది. తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డేనే చూడాలని జనం ఆతృతగా థియేటర్ల బాట పడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల థియేటర్స్ కిక్కిరిసిపోయాయి. టికెట్ల కోసం క్యూ లైన్స్లో వేచి చూస్తున్నారు ప్రేక్షకులు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర, వైజాగ్ సిటీలో అర్థరాత్రి ఒంటిగంటకు మహేష్ అభిమానుల తాకిడి పెద్ద ఎత్తున కనిపించింది. వేళ సంఖ్యలో అభిమానులు థియేటర్స్ కి తరలి వచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు భారీ డిమాండ్ కనిపించింది. అలాగే వైజాగ్ సంగం థియేటర్ ఆర్చ్ని భారీ హంగులతో మహేష్ బ్యానర్లతో తీర్చిదిద్దారు.
మరోవైపు ప్రీమియర్స్ ద్వారా సరిలేరు నీకెవ్వరు సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అభిమానుల తాకిడి మరింత ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పైగా సంక్రాంతి సెలవులు, శనివారం కాబట్టి ఈ రోజు థియేటర్లన్నీ మహేష్ బాబు అభిమానులతో కళకళలాడటం ఖాయమే అంటున్నారు సినీ విశ్లేషకులు.