twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంపేస్తామని బెదిరింపులు: ప్రధాని మోడీకి కట్టప్ప కూతురు లేఖ!

    నటుడు సత్యరాజ్ కూతురు మోడీకి ఫిర్యాదు చేశారు. ఫార్మా కంపెనీ వారు తనను బెదిరించినట్లు తెలిపారు.

    By Bojja Kumar
    |

    బాహుబలి కట్టప్ప, నటుడు సత్యరాజ్ కూతురు దివ్య.... ప్రధాని మోడీకి లెటర్ రాయడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. ఆ లేఖలో తనను కొందరు వ్యక్తులు చంపుతామని బెదిరించారని ఆమె తెలిపారు.

    అమెరికాకు చెందిన ఓ ఫార్మా సంస్థ తయారుచేసిన టాబ్లెట్‌లో విటమిన్ల ఓవర్‌డోస్‌ ఉన్నట్లు, దీని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించిన న్యూట్రీషనిస్ట్‌ దివ్య వాటిని తన పేషెంట్లకు సిఫారసు చేయడానికి తిరస్కరించారు.

     Sathyaraj's daughter writes an urgent letter to PM Modi

    ఈ విషయం తెలుసుకున్న సదరు ఫార్మా సంస్థకు చెందిన ప్రతినిధులు రంగంలోకి దిగి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని, అందుకు ఆమె నిరాకరించడంతో చంపుతామని బెదిరించినట్లు తెలుస్తోంది.

    ఈ వ్యవహారాన్ని ఊరికే వదిలేస్తే చాలా డేంజర్ అని భావించిన దివ్య... ఈ విషయాన్ని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఫార్మా సంస్థ కు సంబంధించిన వివరాలు, వారి మందుల వల్ల జరిగే ప్రమాదం, తనను బెదిరించిన విషయాన్ని వివరంగా ఆమె తన లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

    English summary
    Actor Sathyaraj’s daughter, Divya Sathyaraj has written a letter to Prime Minister Narendra Modi. It was said that the actor’s daughter had been threatened to prescribe supplements with harmful ingredients to her patients.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X