Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిమజ్జనం చేసిన దేవిశ్రీప్రసాద్.., విగ్రహం ఏర్పాటు
రాజమండ్రి : ఇటీవల కన్ను మూసిన తన తండ్రి సత్యమూర్తి (ప్రముఖ రచయిత) అస్తికలను రాజమండ్రిలోని గోదావరి నదిలో ఈరోజు నిమజ్జనం చేశారు ప్రముఖ సంగీత దర్శకులుదేవీశ్రీ ప్రసాద్. రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ లో కర్మకాండ శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం ఈ నిమజ్జనం చేసారు. ఈ సందర్బంగా కలిసిన లోకల్ మీడియాతో ఆయన మాట్లాడారు.
దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ... తూర్పుగోదావరి జిల్లాలోని వెదురుపాక తమ స్వగ్రామమని అన్నారు. అలాగే...మానాన్న సత్యమూర్తికి తాను పుట్టిపెరిగిన గోదావరి తీరమంటే ప్రాణమని' అని చెప్పుకొచ్చారు.
ఇక తన తండ్రి ఆయన తల్లితండ్రుల కోసం సూర్యోదయం పేరుతో గృహాన్ని నిర్మించినట్లు చెప్పారు. మే24న తన తండ్రి సత్యమూర్తి పుట్టినరోజు కావడంతో వెదురుపాకలోని తమ స్వగృహంలో వేడుకలు నిర్వహించి ఆయన విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు.
తన తండ్రి అస్తికలను గోదావరితో పాటు గంగానది సహా పలు నదుల్లో నిమజ్జనం చేయనునట్లు తెలిపారు. దేవీశ్రీప్రసాద్తో పాటు అతని సోదరుడు సాగర్ ఉన్నారు.
సత్యమూర్తి... రచయితగా పనిచేసిన తొలిచిత్రం ‘దేవత'. చంటి, ఛాలెంజ్, భలేదొంగ, అభిలాష, పెదరాయుడు, ఖైదీ నంబర్ 786 లాంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు.