Just In
- 7 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 48 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 1 hr ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
Don't Miss!
- Sports
మహ్మద్ సిరాజ్కు నాతో చీవాట్లు తినడం ఇష్టం: టీమిండియా బౌలింగ్ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- News
జగ్గంపేటలో ఘోర ప్రమాదం .. మంటల్లో ఇద్దరు సజీవ దహనం , ముగ్గురికి గాయాలు
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శ్రియ కి ఇదేం పిచ్చి!? బాలయ్యతో చేస్తూనే, నెగెటివ్ రోలా ??
శ్రియ లేటు వయసులో ప్రయోగాలు చేస్తుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రయోగాలకు అవకాశం చుడుతుంది. ప్రస్తుతానికి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నప్పటికీ మార్కెట్ ని మరింత పెంచుకోవడం కోసం నెగిటివ్ రోల్స్ కూడా ఓకే చేస్తున్నది.

మరోసారి బాలయ్యతోనే
బాలయ్య తో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేసి విజయం అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి బాలయ్యతోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తుంది. తమిళ్ లో కూడా శింబుతో ఓ సినిమాలో రొమాన్స్ చేస్తోంది. అలానే.. నరకాసురన్ అనే మూవీలో నెగటివ్ రోల్ చేసేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది.

కార్తీక్నరేన్
దీనికి సృష్టికర్త నవ దర్శకుడు కార్తీక్నరేన్. తొలి చిత్రంతోనే శభాష్ అనిపించుకున్న ఈ వర్ధమాన దర్శకుడు తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం పేరే నరకాసురన్. ఇందులో అరవిందస్వామి ప్రధాన పాత్ర పోషించనున్నారు. యవ కథానాయకుడిగా టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య నటించడానికి అంగీకరించినా, ఇప్పుడు వైదొలగినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది.

మరో టాలీవుడ్ నటుడి కోసం
కారణం చైతు త్వరలో తన ప్రేయసి సమంతను వివాహమాడబోతుండడమేనని సమాచారం. ఆయన పాత్రలో మరో టాలీవుడ్ నటుడి కోసం వేట మొదలైందని తెలుస్తోంది. ఇందులో ప్రతినాయకిగా శ్రియ నటించనుందట. కథ వినగానే తన పాత్ర తెగ నచ్చేయడంతో విలనీయం ప్రదర్శించడానికి శ్రియ సిద్ధం అనేసిందట.

గౌతమ్మీనన్
మరో విషయం ఏమిటంటే ఆ చిత్ర కథ నచ్చడంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్మీనన్ తానే నిర్మించడానికి ముందుకు వచ్చారట. చిత్ర షూటింగ్ ఆగస్ట్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే చిత్ర దర్శకుడు కార్తీక్నరేన్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోనున్నాడట.