Just In
Don't Miss!
- News
Republic day:72వ గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్న భారత్
- Finance
కేంద్ర బడ్జెట్ యాప్, ఆ తర్వాతే అందుబాటులో డాక్యుమెంట్స్
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గంటలోనే: శృతిహాసన్ టాలెంట్ చూసి షాక్
హైదరాబాద్: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు శృతి హాసన్ మ్యూజిక్ డైరెక్టరుగా, సింగర్ గా రాణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇటు దక్షిణాది సినిమాలతో పాటు అటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతున్న శృతి హాసన్ తను నటిస్తున్న బాలీవుడ్ సినిమాలో పాట పాడింది. ఆ పాటకు ఓ ప్రత్యేకత కూడా ఉంది.
శృతిహాసన్ నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం ‘గబ్బర్ ఈజ్ బ్యాక్' కోసం ఓ సాంగ్ ను పాడింది. శృతి పాడిన పాట ఎలాంటి గ్యాప్ లేకుండా ఒక గంట సమయంలో రికార్డింగ్ పూర్తి చేసిందట. శృతి నటిస్తున్న తమిళ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతుంది. పొల్లాచ్చిలో షూటింగ్ ముగియగానే ఇంటికి వెళ్లలేదట. అక్కడి నుంచి నేరుగా ముంబయిలోని రికార్డింగా థియేటర్కు చేరుకుని కేవలం హాఫ్ డే లోనే ఎలాంటి బ్రేకు లేకుండా ఈ సాంగ్ ను సక్సెస్పుల్గా కంప్లీట్ చేసిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ప్రస్తుతం శృతి హాసన్ నటిస్తున్న సినిమాల వివరాల్లోకి వెళితే....బాలీవుడ్ నాలుగు సినిమాలు, తమిళంలో ఒకటి, తెలుగులో ఒక సినిమా చేస్తోంది. తెలుగు ఆమె మహేష్ బాబు సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇక బాలీవుడ్లో యాత్ర, వెల్ కం బ్యాక్, గబ్బర్ ఈజ్ బ్యాక్, రాకీ హాండ్సమ్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో ‘పులి' అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె కెరీర్ గ్రాఫ్ సంతృప్తి కరంగా సాగుతోంది.