సైమా 2015: దుబాయ్లో బాలయ్య, బన్నీ, రానా, హీరోయిన్లు (ఫోటోస్)
హైదరాబాద్: ది బిగ్గెస్ట్ అవార్డ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్... సైమా 2015(సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. రెండు రోజుల పాటు దుబాయ్ లో ఈ వేడుక సినీ ప్రియులకు కన్నుల విందుగా సాగబోతోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్స్ తమ బ్యాగులు సర్దుకుని ఎయిర్ పోర్టుకు చేకోగా, మరికొందరు ఆల్రెడీ దుబాయ్ లో ల్యాండ్ అయ్యారు.
సైమా 2015 వేడుకలో పలువురు సౌత్ స్టార్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు అవుతున్నారు. ఈ వేడుకలో స్టార్స్ అంతా తమ ఆట పాటలు, వివిధ కార్యక్రమాలతో అలరించబోతున్నారు. సౌతిండియా సినిమా పరిశ్రమకు సంబంధించి ఇదే అతి పెద్ద వేడుకగా నిలవబోతోంది.
అల్లు అర్జున్, బాలకృష్ణ, రానా, శృతి హాసన్, లక్ష్మి మంచు, దేవిశ్రీ ప్రసాద్, చార్మి ఇలా టాలీవుడ్ స్టార్స్ అంతా దుబాయ్ లో ఇప్పటికే దిగిపోయారు. ఈవెంట్ ప్రారంభానికి ముందు అంతా దుబాయ్ లో సందడిగా గడిపారు. ఆగస్టు 6 రాత్రి పార్టీ ఈ వెంట్ జరుగుతుందని సమాచారం.
స్లైడ్ షోలో సైమా-2015 వేడుకలో సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు......

బాలయ్య
సైమా-2015 వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ వచ్చిన నందమూరి బాలకృష్ణ.

అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు.

రానా
సైమా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రానా, శ్రీయ, అదా శర్మ, ఉషా ఉతప్.

శృతి హాసన్
సైమా వేదిక వద్ద సౌతిండియా స్టార్ హీరోయిన్ శృతి హాసన్.

బ్రహ్మీ, చార్మి, లక్ష్మి
సైమా 2015 వేడుకలకు హాజరైన చార్మి, బ్రహ్మానందం, మంచు లక్ష్మి తదితరులు.

దేవిశ్రీ ప్రసాద్
దేవిశ్రీ ప్రసాద్ ప్రసాద్ సైమా వేడుకలో తన ఆట, పాటలతో రాకింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.

తాప్సీ ప్రాక్టీస్
హీరోయిన్ తాప్సీ సైమా వేడుకలో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. అందులో భాగంగా ప్రాక్టీస్ ఇలా....

ప్రణీత
హీరోయిన్ ప్రణీత కూడా ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు.

పూజా హెడ్గే
సైమా వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన హీరోయిన్ పూజా హెడ్గే.

తమన్
సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ కూడా ఆల్రెడీ దుబాయ్ లో ల్యాండ్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











