మంచు మనోజ్ కుమార్ హీరోగా 'నేను మీకు తెలుసా' చిత్రం తమిళ,తెలుగు భాషల్లో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోని సోనీ బి.ఎమ్.జి వారు మార్కెటింగ్ చేస్తున్నారు. ఇందులో ఇళయరాజా సూపర్ హిట్ మబ్బే మసగేసిందిలే సాంగ్ ని రీమిక్స్ చేసారు. దాన్ని తమిళ లిటిల్ సూపర్ స్టార్ శింబు..ప్లే బ్యాక్ సింగర్ గీతా మాధురి తో కలసి పాడారు. దాంతో ఓ తెలుగు హీరోకి తమిళ హీరో గొంతు ఇచ్చినట్లయింది. ఇక ఈ చిత్రాన్ని అజయ్ శాస్త్రి డైరక్ట్ చేస్తూండగా...అంచు అనే నూతన సంగీత దర్శకుడు మ్యూజిక్ అందిస్తున్నాడు.