Just In
- 13 min ago
RRR యూనిట్కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 10 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరంజీవి ముందే మాలో తీవ్రంగా గొడవలు.. నరేష్ను టార్గెట్ చేస్తూ.. వేదికపైనే భగ్గుమన్నరాజశేఖర్
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమాన్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..

డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో
మా డైరీ ఆవిష్కరణ 2020 సందర్భంగా తమిళ చిత్ర పరిశ్రమలోని నడిగర సంఘంలో చోటుచేసుకొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ప్రస్తావించారు. ఓ దశలో నడిగర సంఘం అభివృద్దిని, సంక్షేమ పథకాలను చూసి ఆశ్చర్యపోయాను. వారి స్థాయికి మనం వెళ్లలేమా అనే సందేహం కలిగేది. కానీ అక్కడ డబ్బు పెరిగిన కొద్ది అక్కడ కూడా వివాదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి అని చిరంజీవి అన్నారు.

రాజశేఖర్ మైక్ లాక్కోవడంపై
చిరంజీవి ప్రసంగిస్తుండగా రాజశేఖర్ మైక్ తీసుకొని మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే నేను ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతున్నాను. నన్ను మాట్లాడిన తర్వాత నీవు మాట్లాడు. నన్ను మధ్యలో ఆపితే నేను డిస్కనెక్ట్ అవుతాను. నీవు దగ్గరకి వస్తే నాకు అదోలా ఉంటుంది అని చిరంజీవి పేర్కొన్నారు. దాంతో పరుచూరి గోపాలకృష్ణ నుంచి మైక్ లాక్కొనేందుకు ప్రయత్నించారు.

సభలో తీవ్ర గందరగోళం
పరుచూరి గోపాలకృష్ణ నుంచి హీరో రాజశేఖర్ మైక్ లాక్కోవడంపై చిరంజీవి అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో సభలో కొంత గందరగోళం నెలకొన్నది. చిరంజీవి వ్యాఖ్యలపై రాజశేఖర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజశేఖర్ తీరుపై మోహన్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా సభపైనే భగ్గుమన్నాయి.

రాజశేఖర్ ఆవేశంగా
మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతుండగానే హీరో రాజశేఖర్ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మా అధ్యక్షుడు వీకే నరేష్ చేసిన అవకతవకలను మాత్రమే నేను చెప్పాను. నిప్పును కప్పి పుచ్చితే పొగ రాకుండా ఉండదు అంటూ రాజశేఖర్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

పెద్దలకు గౌరవం ఇవ్వకుండా
అంతేకాకుండా చిరంజీవి, రాజశేఖర్ మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగింది. పెద్దలను పిలిచి సభ వేదికపై గౌరవం ఇవ్వకుంటే ఇక్కడ ఎందుకు ఉండాలి అంటూ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. వేదికపైనే సుబ్బిరామిరెడ్డి, చిరంజీవి, మోహన్బాబు కాళ్లకు మొక్కారు. రాజశేఖర్ ప్రవర్తనపై చిరంజీవి, మోహన్ బాబు విస్మయం వ్యక్తం చేశారు.