శ్రీదేవి అంత్యక్రియలకు వెళ్లేది వీరే.. తెలుగు, తమిళ పరిశ్రమల నుంచి..
Recommended Video

గ్లామర్ క్వీన్ శ్రీదేవి మృతివార్తతో తల్లడిల్లిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలోనూ, ఇతర మార్గాలలో తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక శ్రీదేవిని కడసారి దర్శించుకొనేందుకు అభిమానులు ఇప్పటికే ఆమె నివాసం వద్దకు భారీ సంఖ్యలో గుమిగూడారు. పలువురు దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులు ముంబైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ముంబైకి చేరుకొన్న రజనీకాంత్
శ్రీదేవితో దాదాపు 20 చిత్రాల్లో కలిసి నటించిన సూపర్స్టార్ రజనీకాంత్ ఇప్పటికే ముంబై చేరుకొన్నారు. శ్రీదేవి తొలిచిత్రం మూండ్రూ ముడిచు అనే చిత్రంలో రజనీ, కమల్ హాసన్తో కలిసి ఆమె నటించిన సంగతి తెలిసిందే. తనకు అత్యంత ఆప్తురాలైన శ్రీదేవిని కడసారి చూసేందుకు ఆయన ప్రస్తుతం ముంబైలో ఉన్నారు.

దర్శకుడు రాఘవేంద్రరావు కూడా
తెలుగులో శ్రీదేవితో దాదాపు 24 చిత్రాల్లో కలిసి పనిచేసిన దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ముంబైకి వెళ్తున్నట్టు సమాచారం. శ్రీదేవి అత్యంత ఇష్టమైన నటిగా చెప్పుకునే రాఘవేంద్రరావు ఆమెకు శ్రద్ధాంజలి అర్పించనున్నారు.

హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
తెలుగు హీరోలలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అంత్యక్రియలకు హాజరుకానున్నట్టు తెలుస్తున్నది. ఇంకా వీరితోపాటు పలువురు సినీ ప్రముఖులు కూడా టాలీవుడ్ నుంచి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

తమిళ పరిశ్రమ నుంచి
తమిళ పరిశ్రమకు చెందిన భారతీరాజా, కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్ తదితరులు కూడా శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











