Don't Miss!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ చరణ్ కోసం శ్రీకాంత్కు రూ. కోటి ముట్టజెప్పారట!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలుత రామ్ చరణ్తో పాటు వెంకటేష్ను కూడా తీసుకోవాలనుకున్నారు. అయితే పాత్ర నచ్చక పోవడంతో వెంకటేష్ ఈ చిత్రం నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఆయన స్థానంలో శ్రీకాంత్ను తీసుకున్నారు. ఇపుడు ఈ సినిమాకోసం శ్రీకాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ సర్వత్రా చర్చనీయాంశం అయింది. సాధారణంగా శ్రీకాంత్ హీరోగా చేసే సినిమాలకు సైతం మార్కెట్ వ్యాల్యూను బట్టి రెమ్యూనరేషన్ 60 నుండి 70 లక్షలకు మించి ఉండదు. అయితే రామ్ చరణ్ సినిమా కావడంతో శ్రీకాంత్కు భారీ మొత్తం ఆఫర్ చేసారని, శ్రీకాంత్ తన కెరీర్లో తొలిసారిగా రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ సినిమాకు ఉండే మార్కెట్ వ్యాల్యూ దృష్ట్యా.... సినిమాలో శ్రీకాంత్ ప్రాత ప్రాధాన్యతను బట్టి ఇంత రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసారట. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ కుటుంబకథా చిత్రంలో కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ, రాజ్ కిరణ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్తో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరింది. కొన్ని రోజులుగా హైదరాబాద్లోనే షూటింగ్ జరుగుతోంది. అయితే ఇటీవల రామ్ చరణ్ అనారోగ్యం పాలవ్వడంతో షూటింగ్ నిలిపి వేసారు.