రజనీకాంత్ ‘రోబో 2.0’లో మరో బాలీవుడ్ విలన్
రజినీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'రోబో2.0' సినిమా షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్కు వచ్చేసింది. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తుండగా, ఇందులో మరో విలన్గా బాలీవుడ్ యాక్టర్ సుధాన్షు పాండే నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఈ మూవీలో డాక్టర్ బోరా కొడుకు పాత్రలో నెగిటివ్ పాత్రలో నటిస్తున్నానని సోషల్ మీడియాలో వెల్లడించాడు. అంతేకాదు అక్షయ్ కుమార్కు, తనకు మధ్య ఒక ఫైట్ కూడా ఉన్నట్లు చెప్పాడు. అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్నా పూర్తి విలన్ మాత్రం అక్షయ్ కుమారేనని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











