Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జూ ఎన్టీఆర్ ట్రై చేస్తే....సందీప్ కిషన్కి దక్కింది!
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'జోరు' అనే టైటిల్తో సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ టైటిల్ ఎన్టీఆర్కు కాకుండా మరో హీరోకు ఖరారైంది. ఇటీవల 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చచుకున్న సందీప్ కిషన్ కిషన్ త్వరలో 'జోరు' సినిమాతో రాబోతున్నాడు.
సందీప్ కిషన్ హీరోగా నూతన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ కీర్తి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'గుండెల్లో గోదారి' వంటి ఉత్తమాభిరుచి గల చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నిర్మాతలు అశోక్, నాగార్జునలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరో సందీప్ కిషన్ సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. రాశిఖన్నా, ప్రియాబెనర్జి, సుష్మలు హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఈ చిత్రం కథకు అనుగుణంగా 'జోరు' టైటిల్ యాప్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ ఖరారు చేసినట్లు తెలిపారు.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్గా 'జోరు'ను రూపొందిస్తున్నట్లు దర్శకుడు కుమార్ నాగేంద్ర తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై నెలాఖరులో గాని, ఆగష్టు నెల ప్రధమార్ధంలో గాని విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత లు అశోక్, నాగార్జున లు తెలిపారు. మరో వైపు సందీప్ కిషన్ నటించిన 'రారా కృష్ణయ్య చిత్రం' విడుదలకు సిద్దమవుతోంది.