Don't Miss!
- News పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాన్న పేరు చెడగొడతామేమో.. అప్పుడే సావిత్రి గారి ఇల్లు చూశాం!
లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర మహానటి చిత్రంగా తెరకెక్కించారు. అశ్విని దత్ ఈ చిత్రాన్ని వెనుక ఉండి నడిపించగా ఆయన కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించారు. ఇటీవల అల్లు అరవింద్ మహా నటి చిత్ర యూనిట్ కు ఘనమైన పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో స్వప్న దత్ మాట్లాడారు.
వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని నిర్మించిన సంగతి తెలిసిందే. మహానటి చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు.. నాన్నగారి పేరు ఎందుకు చెడగొడతారు అని అన్న వారుకూడా ఉన్నారని స్వప్న దత్ నవ్వుతూ అన్నారు. చివరకు మహానటి చిత్రంతో నాన్నకు మంచి గిఫ్ట్ అందించామని స్వప్న తెలిపారు.
చెన్నైకి తాను, ప్రియాంక, నాగ అశ్విన్ కలసి వెళ్లిన సమయంలో తొలిసారి సావిత్రి గారి ఇల్లు చూశామని అప్పటి నుంచే ఆమె గురించి అనేక ఊహలు మొదలయ్యాయని స్వప్న అన్నారు. మహానటి చిత్రం మంచి వసూళ్లతో ప్రస్తుతం విజయవంతంగా రన్ అవుతోంది.