Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇంకో కొలావరి డీ :మెగా హీరో కోసం ధనుష్ పాట పాడాడు
హైదరాబాద్: సినిమాకు క్రేజ్ తేవాలంటే ఏదో ఒక క్రేజీ కార్యక్రమం చేపట్టాల్సిందే. అందుకోసం దర్శక,నిర్మాతలు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన 'తిక్క' సినిమాకి అలాగే క్రేజ్ తేవటానికి సంగీత దర్శకుడు తమన్ పూనుకున్నాడు. తమన్ అండతో ఈ సినిమాకు తాజాగా ఓ ప్రత్యేకత వచ్చి చేరింది. అదేమిటంటే...
తమిళ సూపర్ స్టార్ ధనుష్ చేత ఈ సినిమాలో ఓ పాట పాడడం. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోలో ధనుష్ పాడిన పాట మేజర్ హైలైట్గా నిలుస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే ధనుష్-థమన్ కలిసి ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తి చేశారు.
@dhanushkraja sings for #Thikka title song @IamSaiDharamTej ❤️❤️❤️❤️😎 pic.twitter.com/n9pKnfJZjJ
— THAMAN SHIVAKUMAR (@MusicThaman) July 19, 2016
గతంలో తాను హీరోగా నటించిన సినిమాల్లో పాటలు పాడిన ధనుష్, ఇలా ఓ తెలుగు హీరో కోసం ప్రత్యేకంగా పాట పాడడం తొలిసారి. ముఖ్యంగా అప్పట్లో ధనుష్ పాడిన 'కోలవెరి' డి అనే పాట పెద్ద సంచలనమే సృష్టించింది. మరి ఈ పాట ఏ రేంజి సక్సెస్ అవుతుందో చూడాలి.
ఇక 'తిక్క' సినిమా విషయానికి వస్తే ... సాయి ధరమ్ తేజ్, లరిస్సా బోన్సి, మన్నార్ చోప్రా జంటగా చేస్తోన్న సినిమా 'తిక్క'. సునీల్ రెడ్డి దర్శకుడు. డాక్టర్. సి.రోహిన్ రెడ్డి నిర్మాత. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్లో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం లడక్లో చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఎస్.థమన్ సంగీతం అందించిన ఆడియోను ఈనెల 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగష్టు 13న విడుదల చేయడానికి నిర్మాత డాక్టర్.సి.రోహిణ్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం అభిమానులతో పాటు అందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాత డాక్టర్.సి.రోహిణ్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా : కె.వి. గుహన్, ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ : కిరణ్ కుమార్, కథ : షేక్ దావూద్, మాటలు : హర్షవర్దన్, డాన్స్ : ప్రేమ్ రక్షిత్.