Don't Miss!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ముమ్మాటికీ తప్పే, నాశనం చేస్తున్నారు : తమ్మారెడ్డి ఫైర్
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా ఓ వివాదం హాట్ టాపిక్ అయింది. కొందరు బడా నిర్మాతలు ఒక ప్యానల్ గా ఏర్పడి రెండు టీవీ ఛానల్స్ కు మాత్రమే సినిమా యాడ్స్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారి తీసింది. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ తెలుగు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
రెండు ఛానల్స్ కు మాత్రమే యాడ్స్ ఇవ్వాలని షరతు పెట్టడం దారుణం. అలా చేయడం ముమ్మాటికీ తప్పే. కొందర బడా నిర్మాతలు.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ను నాశనం చేయాలని చూస్తున్నారు. ప్రైవేటు కంపెనీలు పెట్టుకుని వ్యవస్థను దెబ్బతీయడం సరికాదన్నారు.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ధరను మాత్రమే నిర్ణయించాలని, ఏ చానెల్కు యాడ్ ఇవ్వాలో నిర్మాత నిర్ణయించుకుంటారని భరద్వాజ చెప్పారు. అందరినీ కలుపుకుని పోవాలి, అలా కాకుండా తమ తొత్తులగా ఉండే వారికే ప్రయోజనం చేకూరేలా వ్యవహరించడం సరికాదు అంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.
ఈ వివాదంపై మరికొందరు నిర్మాతలు కూడా స్పందించారు. బండ్ల గణేష్ స్పందిస్తూ.... సిండికేట్ గా ఏర్పడి ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న 14 మంది నిర్మాతల లిస్టులో తాను లేనని స్పష్టం చేసారు. సి కళ్యాణ్ కూడా తాను ఆ నిర్మాతల గ్రూఫులో లేనన్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా ఉన్న ఓ బడా ప్రొడ్యూసర్ కనుసన్నల్లో ఈ వ్యవహారం నడుస్తున్నట్లు టాక్.