బ్రిటిష్ పార్లమెంటులో తనికెళ్ల భరణి ‘ప్యాసా’
హైదరాబాద్: సినీనటుడు, దర్శకుడు, రచయిత కూడా అయిన తనికెళ్ల భరణి రాసిన ఓ పుస్తకం ‘ప్యాసా' పేరిట ఓ పుస్తకం రచించారు. ఇప్పుడా పుస్తకం ఖండాంతరాలకేగి, బ్రిటీష్ పార్లమెంటులో ఆవిష్కరణ జరుపుకుంది. ఓ తెలుగు పుస్తకం బ్రిటీష్ పార్లమెంటులో విడుదల కావడం తొలిసారి.

దీనిపై తనికెళ్ళ భరణి స్పందిస్తూ, తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కాగా, ప్యాసాను బ్రిటీష్ పార్లమెంటు వరకు తీసుకెళ్ళడంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ప్రముఖ పాత్ర పోషించారు. తెలుగమ్మాయి ప్రశాంతి రెడ్డిని వివాహమాడి తెలుగింటి అల్లుడైన బ్రిటీష్ ఎంపీ డాన్ బైల్స్ కూడా ఈ విషయంలో సహకరించారట. బ్రిటన్ లోని తెలుగు సంఘం సభ్యులు కూడా భరణి పుస్తకావిష్కరణ అంశంలో తమ వంతు పాత్ర పోషించారు.
ఉమర్ ఖయ్యాం- ‘ రుబాయత్ ' పుస్తకం స్ఫూర్తిగా తనికెళ్ల భరణి ప్యాసాను రచించారు. ఈ గ్రంథం ఆస్ర్టేలియాతోబాటు వివిధ దేశాల్లోకూడా విడుదలైంది. ఈ పుస్తకం వెల రూ. 100.


Click it and Unblock the Notifications











