Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అమ్మ పేరుకీ గౌరవం... మాకా నామ్: బాలకృష్ణ బాటలో టీమ్ ఇండియా
ఒక వ్యక్తి తన పేరుని ఏ ఫారం లోనింపాల్సి వచ్చినా, ఎక్కడైనా ఎవరి కొడుకో చెప్పుకోవాల్సి వచ్చినా "సన్ ఆఫ్ అంటూ" తండ్రి పేరుని మాత్రమే చెప్పటం ఒక ఆనవాయితీ అయ్యింది. కొన్ని వేల సంవత్సరాలుగా వేళ్ళూనుకు పోయిన పితృస్వామ్య వ్యవస్త వల్ల వచ్చిన ఈ అలవాటుని బద్దలుకొట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినా మార్పు లష్తమే అయ్యింది. బుద్దుడు తల్లి పేరుని కలుపుకొని గౌతమ బుద్దుడైతే... శాతవాహన రాజు, తొలి శాతవాహనుల్లో చివరివాడు అయిన 23వ రాజు తన తల్లి గౌతమీ బాలాశ్రీ పేరుని చేర్చుకొని "గౌతమీపుత్ర శాతకర్ణి అయ్యాడు.
ఆ రాజు కథనే ఇతివృత్తంగా చేసుకొని నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100 వ చిత్రం "గౌతమి పుత్ర శాతకర్ణి".క్రిష్ దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందుతుంది.ఈ చిత్రం తెలుగు నేలను రాజధాని గా చేసుకుని ప్రపంచాన్ని ఏలిన గొప్ప తెలుగు చక్రవర్తి కథ.మన చరిత్ర లో పితృస్వామ్య కథలే వినిపిస్తాయి.అలంటి రోజుల్లో కూడా మాతృమూర్తి పేరు మీద శిలాఫలకాలతో పాటు తన పేరు ముందు కూడా పేరు జోడించుకున్నారు.అందుకే శాతకర్ణి ని "గౌతమీ పుత్ర శాతకర్ణి" అని పిలిచేవారు. పితృస్వామ్య వ్యవస్థ విపరీతంగా ఉండే రోజుల్లో.. ఆ సమాజాన్ని ఎదిరించి తల్లి నామాన్ని పేరుకు ముందు తగిలించుకుని గౌతమి పుత్రుడిగా మారాడు శాతకర్ణి. ఆ శాతకర్ణినే ఫాలో అవుతూ ఇటీవల 'బసవతారక పుత్ర బాలకృష్ణ' అని పేరు వేయించుకున్నాడు బాలయ్య. బాల కృష్ణ ఇక్కడ చేసిన పని టీమ్ ఇండియా సభ్యులకి తెలియక పోవచ్చు గానీ ఆ ఆలోచనని ముందే ప్రారంబించి ఆచరించాడు బసవతారక పుత్రుడు
ఇటివలే బీసీసీఐ "మా కా నామ్" అనే కాంపెయిన్ లో భాగం గా టీం ఇండియా క్రికెటర్లు తల్లి పేరుతో వుండే జెర్సీ లు వేసుకుని కనిపించారు. ధోని, కోహ్లి, రహనే, వాళ్ళ తల్లి పేరుతో ఉన్న జెర్సీలు వేసుకుని కనిపించారు. ధోని, తన తల్లి పేరు దేవకీ, కోహ్లి తన తల్లి పేరు సరోజ్, రహనే తన తల్లి పేరు సుజాతా పేరుతో ఉన్న జెర్సీలు వేసుకుని ఈ కాంపెయిన్ కు తమ వంతు సహకారం అందించారు.. ఈ కాంపెయిన్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. ఏది ఏమయినా ఇలా మాతృ మూర్తి కి గౌరవం ఇవ్వడం అనేది హర్షించదగిన అంశం...