Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
టాలీవుడ్ విభజన: సానుకూలంగా ఏపి ఫిలిం ఛాంబర్!
విభజన ప్రక్రియ స్పష్టంగా త్వరిత గతిన జరగాలని తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య తన వాదన వినిపించారు. ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ తెలంగాణా నిర్మాతల సంఘం అధ్యక్షుడు సాన యాదిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఏర్పరచిన విభజన సిద్ధాంతం ఆధారంగా సినిమా పరిశ్రమను కూడా విభజించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిన రీతిగానే సినిమా పరిశ్రమ కూడా విడిపోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణా దర్శకుల సంగం అధ్యక్షులు అల్లాని శ్రీధర్ మాట్లాడుతూ సామరస్య పూర్వకంగా తెలుగు సినిమా పరిశ్రమ విభజన జరిగితే అందరూ కలిసికట్టుగా పనిచేసే వాతావరణం ఏర్పడుతుందని, తెలంగాణాకు సినిమా ప్రపంచంలో గుర్తింపు వస్తుందని, హైదరాబాద్ ఐదు భాషల సినిమాలకు ఒక హబ్గా ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.
ఇప్పుడు అందరం కలిసుండాలని అంటున్న పెద్దలు తెలంగాణా ఫిలిం ఛాంబర్ను ఎందుకు కలుపుకు పోలేదని తెలంగాణా నిర్మాతల సంగం ప్రధాన కార్యదర్శి సంగ కుమార్ అన్నారు. ప్రస్తుతం సమయ ఉన్నందున ఇరు ప్రాంతాల సినిమా పెద్దలు కుర్చుని సామరస్యంగా సినిమా పరిశ్రమను విభజించాలని తెలంగాణా సినిమా ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి ఏపి ఫిలిం ఛాంబర్ వారు సానుకూలంగా స్పందించారు.
ప్రస్తుతం ఉన్న ఛాంబర్ పేరును తెలుగు ఫిలింఛాంబర్గా మార్చాలన్న ప్రతిపాదనకు అత్యవసరంగా చేయవలసిన ఆవశ్యకత లేదని ఆంధ్ర ప్రాంతానికి చెందిన సభ్యులు సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్లు అభిప్రాయ పడ్డంతో సభ వాయిదా పడిందతీ తెలంగాణ నిర్మాతల సంఘం సభ్యులు తెలిపారు.