Don't Miss!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బుద్దిలేని గాడిదలు అంటూ వేణు మాధవ్ ఫైర్
హైదరాబాద్: తాను చనిపోయినట్లు ప్రచారం చేస్తుండటంపై తీవ్ర మనస్తాపానికి గురైన ప్రముఖ తెలుగు కమెడియన్ వేణు మాధవ్ ఇటీవల ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని వేణు మాధవ్ సీరియస్ గానే తీసుకున్నారు.
ఈ విషయమై ఆయన ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రులునాయిని, తలసానిలను కలిసారు. త్వరలో గవర్నర్ ను కూడా కలుస్తానని, తనపై జరుగుతున్న అసత్యం ప్రచారంపై ఫిర్యాదు చేస్తానని వేణు మాధవ్ వెల్లడించారు.
ఆదివారం హన్మకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఫైర్ అయ్యారు. కొందరు బుద్దిలేని గాడిదలు పనిలేక తనపై ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని వేణు మాధవ్ స్పష్టం చేసారు.
తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరానని వేణు మాధవ్ తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారం వల్ల తనతో పాటు తన అభిమానులు కూడా మనస్తాపానికి గురయ్యారని వేణు మాధవ్ ఆవేదన వెలుబుచ్చారు.