పేలుళ్లను ఖండిస్తూ సినీ సెలబ్రిటీల ట్వీట్లు

రామ్ గోపాల్ వర్మ:
అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని తీవ్ర వాదులు దాడులు జరుపుతున్నారు. అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే వారి లక్ష్యం...
లక్ష్మి మంచు:
బాంబు పేలుళ్ల ఘటన నన్నెంతో బాధించింది. మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాడ సంతాపం. ఇది ద్వేషం-ప్రేమకు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ అందమైన దేశం యొక్క పౌరులుగా మనం ఎల్లప్పుడూ కలిసి మెలిసి ఉండాలి.
శృతి హాసన్:
అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. హైదరాబాద్లో ఉన్న వారంతా బాగుండాలని కోరుకుంటున్నాను.
హరీష్ శంకర్:
హైదరాబాదీలంతా గుండె నిబ్బరంతో ఉండాలని కోరుకుంటున్నాను. దొంగ దెబ్బతీసే పిరికి వారి చేతిలో ఓడిపోకూడదు. ఇలాంటి సమయంలోనే అంతా ఐక్యంగా ఉండాలి.
తమన్:
హైదరాబాద్లో మళ్లీ బాంబు పేలుళ్లు సంభవించడం చాలా బాధాకరం. బాధితుల కుటుంబాలు ఎంతో బాధతో ఉన్నాయి. దేవుడు అందరినీ బాగా చూడాలి.
తాప్సీ: షూటింగులో ఉన్నా. సడెన్గా ఫోన్లు అన్నీ బిజీ అయిపోయాయి. ఏమిటని ఆరాతీస్తే బాంబు పేలుళ్ల విషయం తెలిసింది. ఎంతో షాకయ్యాను.
రూపా వైట్ల:
హైదరాబాద్లో బాంబు పేలుళ్లు. రెడ్ అలర్ట్...అంతా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. టీవీల్లో బాంబ్ బ్లాస్ట్ విజువల్స్ చూసి షాకయ్యాను. అమాయక ప్రజలను దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాను.
దేవిశ్రీ ప్రసాద్:
బాంబు పేలుళ్ల ఘటన నన్ను ఎంతో బాధించింది. అందరికీ మంచి జరుగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను.


Click it and Unblock the Notifications











