Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కెల్విన్ వాట్సప్లో వందల మెసేజ్లు.. నా తండ్రి మరణంతో విషాదంలో ఉంటే ఇదేంటి?.. తనీష్
హైదరాబాద్లో సంచలనం రేపిన డ్రగ్ రాకెట్ కేసులో టాలీవుడ్ నటుడు తనీష్ అల్లాడి సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరయ్యారు.
హైదరాబాద్లో సంచలనం రేపిన డ్రగ్ రాకెట్ కేసులో టాలీవుడ్ నటుడు తనీష్ అల్లాడి సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరయ్యారు. డ్రగ్ రాకెట్ ముఠాకు చెందిన కెల్విన్ అరెస్ట్ తర్వాత 12 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూరీ జగన్నాథ్, రవి తేజ, చార్మీ కౌర్, శ్యాం కే నాయుడు, రవి తేజ డ్రైవర్, ముమైత్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలో నోటీసులు అందుకొన్న 11వ వ్యక్తిగా తనీష్ సిట్ ముందు హాజరయ్యాడు.
డ్రగ్ కేసులో పేరుపై ఆందోళన
డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు జాబితాలో ఉండటంపై తనీష్ ఆందోళన వ్యక్తం చేశాడు. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంపై తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్లో కొన్నేండ్లుగా ఉన్నప్పటికీ.. తాను ఎలాంటి వివాదంలో ఇరుక్కోలేదని ఆయన చెప్పాడు.
Recommended Video
తండ్రి మరణంతో కుంగిపోయాను..
ఇటీవలనే నా తండ్రి స్వర్గస్తులయ్యాడు. ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇంటికి పెద్ద కొడుకుగా అనేక బాధ్యతలు నాపై పడ్డాయి. దాంతో సమాజపరమైన బంధాలను కూడా తగ్గించుకొన్నాను. కనీసం విందులు, వినోదాలకు దూరమయ్యాను. కెరీర్ను మళ్లీ చక్కబెట్టుకొనేందుకు కష్ఠపడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో డ్రగ్ మాఫియాలో నా పేరు బయటకు రావడం షాక్ గురిచేసింది అని తనీష్ అన్నారు.
ఆందోళనలో నా కుటుంబం
డ్రగ్స్ కేసు గురించి తెలిసినప్పటి నుంచి నా కుటుంబం చాలా ఆందోళనకు గురవుతున్నది. ఓ రకమైన భయం వారిని వెంటాడుతున్నది. నాకు ఈ వ్యవహారంతో సంబంధం లేకుండానే నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. అయినా నోటీసుల వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ విచారణకు హాజరయ్యాను అని మీడియాతో పేర్కొన్నారు.
కెల్విన్ కాల్ లిస్టులో తనీష్..
కెల్విన్తో సంబంధాలున్నాయన్న ఆధారాలతో తనీష్కు నోటీసులు జారీ చేశామని సిట్ అధికారులు పేర్కొన్నారు. కెల్విన్ కాల్ లిస్టులో తనీష్ పేరు ఉందని, వందల మెసేజ్లు వాట్సాప్లో కనిపించాయి. దాదాపు వందకు పైగా వాట్సాప్ మెసేజ్లు తనీష్ నుంచి కెల్విన్కు వెళ్లినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. కెల్విన్తో నేరుగా సంబంధాలున్నాయని కూడా తనీష్పై ఆరోపణలున్నాయి. అందుకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.