టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సంచలన ప్రకటన..రాజకీయాల్లోకి ఎంట్రీ, తెలంగాణ నుంచి పోటీ!
టాలీవుడ్ హీరోయిన్ రేష్మ రాథోర్ సంచలన ప్రకటన చేసింది. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వెల్లడించింది. 2019 లో తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కూడా ప్రకటించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. రేష్మ రాథోర్ ఈరోజుల్లో, లవ్ సైకిల్ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. మరో కొన్ని చిత్రాలలో కీలక పాత్రలో నటించింది.

కాగా రేష్మ రాథోర్ కు ప్రస్తుతం సినీ అవకాశాలు బాగా తగ్గాయి. రేష్మ తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి. సినిమాల్లోనటిస్తున్నప్పటికీ తన ఊరి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానని రేష్మ చెబుతోంది. 2019 ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం విశేషం. ఏప్రిల్ 14 న తాను జాతీయ పార్టీలో చేరబోతున్నట్లు రేష్మ ప్రకటించింది.


Click it and Unblock the Notifications











