twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్లు వద్దంటూ...నోటికి పనిచెప్పిన త్రిష

    By Bojja Kumar
    |

    Trisha
    సినిమా రంగంలోకి వచ్చి ఇన్నేళ్లయినా...టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగినా హీరోయిన్ త్రిష ఇప్పటికీ తన పాత్రలకు సొంత డబ్బింగ్ చెప్పుకోవడం లేదు. అయితే ఇతర హీరోయిన్లు సొంత డబ్బింగ్ చెప్పుకుంటూ ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెంచుకుంటున్న నేపథ్యంలో త్రిష కూడా అదే దారిలో నడుస్తోంది. ఇకపై వేరొకరి గొంతు తనకు వద్దంటూ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటానని దర్శక నిర్మాతలకు చెబుతోంది.

    తమిళ చిత్రం 'మంకాత్తా' చిత్రం కోసం తొలిసారి డబ్బింగ్ చెప్పుకున్న త్రిష ఇకపై తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయంపై త్రిష స్పందిస్తూ ' తొలిసారి 'మంకాత్తా' చిత్రం కోసం డబ్బింగ్ చెప్పాను. అందులో నా వాయిస్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆ స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తారని ఊహించలేదు. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడంలో ఇంత అనుభూతి కలుగుతుందని అనుకోలేదు. ప్రేక్షకుల స్పందనను దృష్టిలో పెట్టుకుని ఇకపై తెలుగు, తమిళ భాషల్లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం తమిళంలో విశాల్‌తో 'సమరన్'లో నటిస్తున్నాను. ఈ చిత్రానికీ నేనే డబ్బింగ్ చెబుతున్నాను' అని తెలిపింది త్రిష.

    త్రిష ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన 'దమ్ము' చిత్రంలో నటిస్తోంది. ఆమె వెంకీతో కలిసి నటించిన 'బాడీగార్డ్' సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయానికి తోడు 'దమ్ము' చిత్రంలో కూడా చేస్తుండటంతో తెలుగులో త్రిష జోరు మళ్లీ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

    English summary
    South Indian top notch Trisha is reportedly interested in giving her own voice for her roles. Mankatha is the first movie that has dialogues said by her and the actress is keen to continue the same with her Samaran.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X