Don't Miss!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
త్రివిక్రమ్ డైరక్షన్: రామ్ చరణ్, ధోణి లతో...
మరో ప్రక్క రామ్ చరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో త్వరలో ఓ మెగా మూవీ రాబోతోంది. విశ్వసనీయంగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. 2010లో త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ పెప్సి యాడ్లో నటించినప్పటి నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నప్పటికీ....ఈ సారి మాత్రం ఈ వార్త నిజం కాబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్ కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై నిర్మాత,మిగతా సాంకేతిక నిపుణల సమాచారంతో కూడిన పూర్తి ప్రకటన వచ్చే అవకాసం ఉంది.
ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ ఓకే అయిందని, ప్రస్తుతం ఈ ఇద్దరు కమిటైన సినిమాలు పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఫ్లోర్ మీదకు రానున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్టు వర్కు, డైలాగులు తదితర పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో సినిమా చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం పూర్తయిన తర్వాత చరణ్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన 'ఎవడు' విడుదలకు సిద్దంగా ఉంది.