Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
యాంకర్ ఉదయభాను కేసు... ఫోరెన్సిక్ ల్యాబ్కు..
హైదరాబాద్ : ''మధుమతి' సినిమా కోసం నా ఫొటోల్ని మార్ఫింగ్ చేశారు. దీంతోపాటు కొన్ని వెబ్సైట్లు, పత్రికలు అసభ్యమైన కథనాల్ని ప్రచురించాయి. అందులో నా అభిప్రాయాన్ని కూడా పొందుపరచలేదు'' అంటూ ఉదయభాను ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తాను నటించిన సన్నివేశాలను మార్ఫింగ్ చేశారంటూ ఉదయభాను చేసిన ఫిర్యాదు విషయంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోనున్నారు.
ఉదయభాను తన ఫిర్యాదుతోపాటు కొన్ని ఆధారాలను సైతం సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ఈ ఫోటోలు నిజంగా మార్ఫింగ్ చేసినవా, కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక దర్యాప్తులో కీలకం కానుంది. ఉదయభాను ఫిర్యాదు ఆధారంగా సదరు వెబ్సైట్పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మధుమతి సినిమా విషయంలో దర్శకుడు రాజ్శ్రీధర్ తనని మోసం చేశారని ఉదయభాను ఆరోపించింది. ఈ విషయమై దర్శకుడు శ్రీధర్ వద్ద ప్రస్తావిస్తే ''ఉదయభాను ఆరోపణలు నిరాధారం. ఆమె ఎందుకలా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు''అన్నారు.
ఉదయభాను మాట్లాడుతూ... ''నాకు సినిమా కథ చెప్పినప్పుడు ఎంతో నచ్చి నటించడానికి అంగీకరించాను. ఇప్పుడు చూస్తే పూర్తిగా కథని, నా పాత్రని మార్చేశారు. విడుదలకు ముందు నాకు సినిమా చూపించలేదు. అసలు విడుదలవుతున్న విషయమే ఎవరో చెప్తే ఐదురోజుల క్రితం తెలిసింది. ఈ లోగా నా గురించి కొన్ని వెబ్సైట్లు, పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశాను. వాళ్లు సమయం చాలదు మేము ఏమీ చేయలేం పోలీసుల్ని ఆశ్రయించమన్నారు. దీంతో వారిని ఆశ్రయించాను. వాళ్ల ద్వారా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. పోలీసుల సహాయంతోనే నేను, తమ్మారెడ్డి భరద్వాజగారు గురువారం సినిమా చూశాం. నాకే ఇబ్బందికరంగా అనిపించింది. నాలాంటి వాళ్లు ఎవరూ భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా దీనిపై పోరాటం చేస్తాను'' అన్నారు ఉదయభాను.