Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నా చిట్టి చెల్లి ఇక రాదు.. విషాదంలో యాంకర్ ఉదయ భాను
ఒకప్పుడు యాకర్ గా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న యాంకర్ ఉదయభాను ప్రస్తుతం తన ఫ్యామిలీతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా కాలం తరువాత ఆమె ఒక విషాదకరమైన వార్తతో ఆమె నెటిజన్స్ ని కదిలించింది. దేవుడిచ్చిన చెల్లె తనతో ఇక లేదంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా తన బాధను వ్యక్తపరచింది.
Recommended Video
విడదీయలేని బంధం..
2014 నిగ్గదీసి అడుగు కార్యక్రమం చేస్తున్నప్పుడు నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం ఖుదాబక్షుపల్లి లో నాకు ఈ చిట్టి తల్లితో విడదీయలేని బంధం ఏదో ముడిపడిపోయింది.రజితమ్మ నాకు దేవుడిచ్చిన బంగారు చెల్లెల్లలో ఒకరు.తను ఇక లేదు. 24 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి.. తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయింది.
కరోనా మరణం కాదు..
ఇది కరోనా మరణం కాదు... గాలి నీరు నింగిని కల్మషం చేసిన కరుణ లేని కర్కశుల వల్ల కలిగిన మరణం.ఫ్లోరైడ్ రక్కసి కోరల్లో చిక్కుకున్న నిస్సహాయులైన బిడ్డలెందరో.. కలుషిత నీటి రూపం లో ఫ్లోరైడ్ విషం తాగుతున్న బిడ్డలెందరో.. తాము చేయని తప్పుకు జీవితాంతం శిక్షను అనుభవిస్తున్న అసహాయులు ఎందరో.. అలంటి బిడ్డే ఈ రజితమ్మ.
నా గుండె తరుక్కుపోయింది..
తనకు నా చేతనైంది చేయాలనీ సంకల్పించి తన కాళ్ళ మీద తాను నడవలేకపోయిన, తన జీవితం లో తలెత్తుకుని బ్రతకాలని ఓ చిన్ని ప్రయత్నం చేసాను. ఒక చిన్న కిరానా కొట్టు పెట్టించాను.. అప్పటినుంచి తన తుది శ్వాశ వరకు ఓటమి ఎరుగక ఎంత ముద్దుగా చక్కగా షాప్ ని నడుపుకుందో.. తను తన కుటుంబానికి భారం కాదు ఆసరా అయింది..
సమాధానం చెప్పేది ఎవ్వరు?
ఖుదాభక్షపల్లి లో భూగర్భంలోకి నీరింకినట్టు నా కళ్ళలో నీళ్లింకిపోతున్నాయి.. అక్క నేనెందుకు ఇలా అయ్యాను.. నా తప్పేంటి.. నాలా ఇంకెంతమంది.. ఇంకెంతకాలం ఇలా పుడతారు.. ఇలా తను సంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పేది ఎవ్వరు ? నా చిట్టి చెల్లి రజితమ్మ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నా' అని ఉదయ భానుపేర్కొన్నారు.