డోంట్ మిస్: మంచు మనోజ్ గ్రూమింగ్ సెర్మనీ(ఫోటోలు)
హైదరాబాద్: మంచు మనోజ్ వివాహ వేడుక.... పెళ్లిలా కాకుండా పండగలా సాగుతోంది. ఈ నెల 20 పెళ్లి జరుగనున్న నేపథ్యంలో పది రోజుల ముందు నుండే పెళ్లి ముందుకు జరుగాల్సిన వివిధ కార్యక్రమాలు మొలయ్యాయి. తాజాగా నలుపు పెట్టి పెళ్లికొడుకును చేసే ఫంక్షన్ సంప్రదాయ బద్దంగా నిర్వహించారు.
ఈ వేడుక పలువురు ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ డిజైన్ శిల్పా రెడ్డి తదితరులు హాజరైన ఈ వేడుకకు మరింత కల తెచ్చారు. ఈ వేడుక పూర్తిగా ప్రైవేట్ పంక్షన్ లా సాగింది.
సంగీత్, మెహందీ ఇలా పెళ్లికి ముందు సాగే కార్యక్రమాలన్నీ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు మనోజ్-ప్రణతి వివాహం జరుగబోతోంది. లక్ష్మి మంచు ఇంట్లో మెహందీ సెర్మనీ నిర్వహించనున్నారు. పార్క్ హయత్ హోటల్ లో సంగీత్ కార్యక్రమం జరుగబోతోంది. హైటెక్స్ వివాహ వేడుక గ్రాండ్ గా జరుగబోతోంది. ఈ పెళ్లి వేడుకకు దాదాపు 10వేల మందికి పైగా అథితులు హాజరవుతారని సమాచారం. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

చిరు, బాలయ్య, మోహన్ బాబు
మంచు మనోజ్ గ్రూమింగ్ సెర్మనీలో మంచు మనోజ్, బాలయ్య, మోమన్ బాబు కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

విష్ణు-వెరానిక
పెళ్లి వేడుకలో మంచువిష్ణు, వెరానిక ఇలా....

సరదాగా
చిరంజీవి, బాలయ్య ఇద్దరూ కలిసి ఈ వేడుకలో సరదాగా గడిపారు.

లక్ష్మి మంచు
తన కూతురు నిర్వాణతో కలిసి మంచు లక్ష్మి ఇలా...

బాలయ్య
మంచు విష్ణు, మంచు లక్ష్మిలతో కలిసి బాలయ్య సెల్ఫీ...

లక్ష్మి మంచు, శిల్పా రెడ్డి
ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి, ఇతర అతిథులతో కలిసి లక్ష్మి


Click it and Unblock the Notifications











