Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రంగస్థలం సక్సెస్ తర్వాత ఉపాసన ఆసక్తికరమైన ట్వీట్
మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం తొలి ఆట నుంచే మంచి టాక్ను సొంతం చేసుకొన్నది. ఓవర్సీస్ మార్కెట్లో భారీ కలెక్షన్లను సొంతం చేసుకొన్నది. ప్రేక్షకుల అండతో రంగస్థలం సినిమా దూసుకుపోతున్న నేపథ్యంలో రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని నీ ప్రేమకు దాసోహమయ్యాం అని ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
బాబా.. నీవు మా కోసం ఏదైతో చేశావో.. ఏదైతే చేస్తున్నావో.. భవిష్యత్లో మాకు ఏం చేయబోతున్నావనే విషయానికి నీకు ధన్యవాదాలు అని ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా రాంచరణ్, రంగస్థలం అని హ్యాష్ ట్యాగ్ చేసి సాయిబాబా ఫోటోను ట్వీట్ చేశారు.
Humbled by your love 🙏🏼 #RamCharan #rangasthalam pic.twitter.com/bKHo8r4H5Z
— Upasana Kamineni (@upasanakonidela) March 30, 2018
విభిన్నమైన చిత్రంగా రూపుదిద్దుకొన్న రంగస్థలం సినిమాపై ఉపాసన, రాంచరణ్ భారీగా ఆశలు పెట్టుకొన్నారు. దాదాపు రెండేళ్లు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి సినిమా రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం విడుదలకు ముందే మంచి క్రేజ్ను సంపాదించుకొన్నది.