ఫోర్బ్స్ జాబితాలో రామ్ చరణ్ భార్య ఉపాసన!
Recommended Video

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అపోలో లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో బిజినెస్ పరంగా దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. 'టైకూన్స్ ఆఫ్ టుమారో' పేరిట 'ఫోర్బ్స్ ఇండియా' విడుదల చేసిన ఉజ్వల భవిష్యత్ ఉన్న శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ఉపాసన చోటు దక్కించుకుంది. మొత్తం 22 మందితో కూడిన ఈ జాబితాలో తెలుగు నుండి పివి సింధుకు కూడా చోటు దక్కింది.
vote for your favourite bigg boss contestant here
దేశం బావుండాలనే మనుషుల ఆరోగ్యం బావుండాలి, మనం ఫిట్ నెస్గా, యాక్టివ్గా ఉన్నపుడే ఏదైనా సాధించగలం అని నమ్మే ఉపాసన.... అపోలో లైఫ్ ద్వారా ఇందుకకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అపోలో వ్యాపారాన్ని ఆమె నడిపిస్తున్న తీరు, ఆమె శక్తి సామర్థ్యాలు, ఆలోచన విధానానికి ఇప్పటికే పలువురు నుండి ప్రశంసలు అందాయి. తాజాగా ప్రఖ్యాత ఫోర్బ్స్ సంస్థ కూడా ఉపాసన శక్తి సామార్థ్యాలు గుర్తించడం విశేషం.

'టైకూన్స్ ఆఫ్ టుమారో' పేరిట ముంబైలో మంగళవారం జరిగే ఈ వెంటులో ఉపాసనతో పాటు ఫోర్బ్స్ ప్రకటించిన 22 మంది ఇన్నోవేటర్స్, ఎంట్రెపెన్యూర్స్ను సత్కరించనున్నారు. ఉపాసనకు ఈ గొరవం దక్కడంపై మెగా అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.
ఉపాసన తన అపోలో బిజినెస్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.... తన భర్త రామ్ చరణ్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ఆయన నటిస్తున్న సినిమాలు, అతడికి సంబంధించిన అంశాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం గమనార్హం. అటు తన వ్యాపారాన్ని, ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ఉపాసన దూసుకెళుతోంది.


Click it and Unblock the Notifications











