Just In
Don't Miss!
- News
భారత్ లో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల కలకలం ... 114కు పెరిగిన కేసులు
- Sports
పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లీనే అత్యుత్తమం.. జడేజా కూడా: శ్రీలంక పేసర్
- Finance
4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'మిస్టర్ ' సెట్స్ పై గాయపడ్డ వరుణ్ తేజ,హాస్పటిల్ లో
హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు ..వరుణ్ తేజ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా చేస్తున్న ఓ స్టంట్ సీన్ లో ఆయన గాయపడ్డారు. ఈ షూటింగ్ ప్రస్తుంత ఊటిలో జరుగుతోంది. వెంటనే వరుణ్ తేజని హాస్పటిల్ కు తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్ష చేసి, ట్రీట్మెంట్ ఇచ్చారు. పెద్దగా కంగారు పడాల్సింది లేదని, మూడు వారాలు రెస్ట్ తీసుకుని, మందుకు తీసుకుంటే సరిపోతుందని అంన్నారు. దాంతో షూటింగ్ ని ఆపుచేసారు.
ఆగడు', 'బ్రూస్ లీ' లాంటి రెండు భారీ పరాజయాల తర్వాత మళ్ళీ ఓ బలమైన హిట్ కొట్టాలన్న కసితో దర్శకుడు శ్రీనువైట్ల వరుణ్కు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. దూకుడు బాద్షా, ఆగడు..ఇలా హై యాక్షన్ పోలీస్ ఎంటర్ ట్రైనర్ లు అందించాడు వైట్ల.

అలాగే వరుణ్ తేజ్ తో తీసుకున్న'మిస్టర్' కూడా పోలీసు కథేనన్న లీకు బయటికివచ్చింది. ఇదీ ఓ కాప్ స్టోరీనేనట. అయితే హీరో పాత్ర రెండు రకాలుగా సాగుతుందట. ఈ క్యారెక్టరైజేషనే సినిమాకి హైలెట్ కానుందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది.
లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై 'ఠాగూర్' మధు, నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించనున్నారు. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: గోపీమోహన, మాటలు: శ్రీధర్ సీపాన, సంగీతం: మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం: జె. యువరాజ్, సమర్పణ: బేబీ భవ్య.