Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
చెన్నైకి సాయం: మెగా ఫ్యామిలీ నుండి ఫస్ట్ వరుణ్ తేజ్
హైదరాబాద్: భారీ వరదలతో చెన్నై మహానగరం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని వందలాది కాలనీలను వరదనీరు ముంచెత్తడంతో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం పలువురు తెలుగు సెలబ్రిటీలు సహాయం అందిస్తున్నారు.
ఇప్పటికే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సంపూర్ణేష్ బాబు, నిర్మాత ప్రతాప్ కోలగల్ల తదితరులు సహాయం ప్రకటించగా...మెగా ఫ్యామిలీ నుండి మొదటి సాయం వరుణ్ తేజ్ ప్రకటించారు. చెన్నై వరద బాధితులకు సహాయం అందించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 3 లక్షల సహాయం అందించనున్నట్లు వరుణ్ తేజ్ ప్రకటించారు. త్వరలోనే ఇతర మెగా హీరోలు సైతం సహాయం అందించడానికి ముందుకు రానున్నారు.
మరో వైపు చెన్నై నుండి వస్తోన్న చిత్రాలను చూసి చలించిపోయిన నందమూరి సోదరులు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తమ వంతు సహాయం గా తమిళనాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి సహాయాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ 10 లక్షల రూపాయలను, కళ్యాణ్ రామ్ 5 లక్షల రూపాయలను ప్రకటించారు. రవితేజ రూ. 5 లక్షలు ప్రకటించారు.
నా వంతుగా రూ. లక్ష అందిస్తున్నట్లు నిర్మాత ప్రతాప్ కోలగట్ల ప్రకటించారు.. అతి త్వరలో ముఖ్య మంత్రి జయలలిత గారికి కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని తెలిపారు. నటుడు సంపూర్ణేష్ బాబు నా వంతుగా రూ. 50 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత గారికి కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని సంపూర్నేష్ బాబు తెలిపారు.