ప్రముఖ గేయ రచయిత వాలి కన్నుమూత

మంగళవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను అత్యవసర చికిత్సా విభాగానికి బదిలీ చేశారు. వెంటిలేటర్ మీద ఆయనకు శ్వాస అందిస్తున్నారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు కమలహాసన్, సంగీత దర్శకుడు ఏఆర్.రహ్మాన్లతో పాటు వాలి బంధువులు, సినీ ప్రముఖులు బుధవారం ఆస్పత్రికి చేరుకొని వాలిని పరామర్శించారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలువలేదు.
దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో కొనసాగుతున్న ఆయన ఇప్పటి వరకు పది వేలకు పైగా పాటలు రాసారు. తమిళ సినీ పరిశ్రమలో వాలి పాటలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గడిచిన ఐదు దశాబ్దాలుగా ఆయన చిత్ర పరిశ్రమకు ఆణిముత్యాలు లాంటి పాటలతో సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆయనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సన్మానించింది.


Click it and Unblock the Notifications











