Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'గోపాల గోపాల' నిషేదించాలి: సెన్సార్ బోర్డుతో గొడవ
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషనల్లో తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రంపై విశ్వహిందూ పరిషత్ వారు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసారు. ఈ సినిమా పోస్టర్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేసారు. ఈ సినిమాను నిషేదించాలంటూ సెన్సార్ బోర్డుతో విహెచ్ పి సభ్యులు వాగ్వివాదానికి దిగారు. ఈ సినిమాపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి విహెచ్పి కార్యకర్తలు సిద్దమయ్యారు.
జనవరి 14న సంక్రాంతి సందర్భంగా సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్కుమార్ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నైజాం రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఎన్ఆర్ఏ బేసిస్ కింద రూ. 13.4 కోట్లకు ఆయన ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్బాబు, శరత్మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి(వెంకటేష్) దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్, పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తోంది.