తాజ్ మహల్ వద్ద భర్తతో కలిసి విద్యా బాలన్ సందడి (ఫోటోస్)
ఆగ్రా: బాలీవుడ్ నటి విద్యా బాలన్, నిర్మాత సిద్ధార్థరాయ్ కపూర్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు ప్రేమికులు ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ను సందర్శించారు. విద్యా, సిద్ధార్థ్ ఎప్పుడూ వారి వారి ప్రొఫెషన్లో బిజీగా గడుపుతుంటారు. వారు ఇలా కలిసి బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. లాంగ్ గ్యాప్ తర్వాత ఇద్దరూ తాజ్ మహల్ వద్ద కనపడటంతో అక్కడున్న మీడియా ఫోకస్ అంతా వారి వైపు మళ్లింది.
సిద్ధార్థ్ర్ రాయ్ కపూర్ తో పెళ్లి తర్వాత కూడా విద్యా బాలన్ సినిమా రంగంలో కొనసాగుతూనే ఉన్నారు. తన భర్త కూడా సినీ నిర్మాణ రంగంలోనే ఉండటం, తనను పూర్తిగా అర్థం చేసుకున్నవాడు కావడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యాబాలన్ సినిమా కెరీర్ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం విద్యా బాలన్ టెత్రిన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు ఓ మరాఠీ చిత్రంలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు.
స్లైడ్ షోలో విద్యా బాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ తాజ్ మహల్ సందర్శించిన ఫోటోస్....

విద్యా, సిద్ధార్థ్
తాజ్ మహల్ వద్ద విద్యా బాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్.

ప్రేమ వివాహం
సిద్దార్థ్ రాయ్ కపూర్, విద్యా బాలన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రేమ చిహ్నం
ఈ ఇద్దరు ప్రేమికులు ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ఇటీవల సందర్శించారు.

సెల్ఫీ...
తాజ్ మహల్ వద్ద సెల్ఫీ తీయడానికి సిద్ధమవుతున్న విద్యా బాలన్.

చాలా కాలం తర్వాత...
పెళ్లయిన తర్వాత ఇద్దరూ కలిసి ఇలా ఔటింగుకు రావడం ఇదే తొలిసారి.

గర్భవతి అయినట్లు...
విద్యా బాలన్ ఆ మధ్య తరచూ ఆసుపత్రిని సందర్శించడంతో ఆమె గర్భవతి అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని తేలింది.

త్వరలో ప్లానింగ్..
ప్రస్తుతం పిల్లల విషయంలో ఎలాంటి ప్లానింగు లేదని, త్వరలోనే ఈ విషయం ఇద్దరం ఓ నిర్ణయానికి వచ్చి ప్లాన్ చేసుకుంటామంటోంది విద్యాబాలన్.

పెళ్లి తర్వాత కూడా
పెళ్లి తర్వాత కూడా విద్యా బాలన్ సినిమా రంగంలో కొనసాగుతూనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











